Israel-Hamas Conflict: ‘వెంటనే ఆ దేశాన్ని వీడండి’: తమ పౌరులకు ప్రపంచ దేశాల హెచ్చరికలు
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం లెబనాన్కు విస్తరిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో అక్కడ ఉన్న తమ పౌరులకు వివిధ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి.
ఇంటర్నెట్డెస్క్: హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీని ఇజ్రాయెల్(Israel) డ్రోన్ మట్టుపెట్టడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం విస్తరిస్తుందనే ఆందోళనలు పెరగడంతో లెబనాన్(Lebanon)లో ఉన్న తమ పౌరులకు పలు దేశాలు అడ్వైజరీలను జారీ చేశాయి. తక్షణమే లెబనాన్ను వీడాలని కోరాయి. (Israel-Hamas Conflict)
‘ఇప్పటికీ లెబనాన్లో ఉన్న మా పౌరులు ‘ఎలిఫాండ్’ జాబితాలో రిజిస్టర్ చేసుకోవాలి. సాధ్యమైనంత తర్వగా ఆ దేశాన్ని విడిచిపెట్టాలి’ అని జర్మనీ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అక్టోబర్లో యుద్ధం మొదలైనప్పుడు కూడా ఈ తరహా అడ్వైజరీని జారీ చేసింది. కెనడా, స్వీడన్ సహా పలు అమెరికా మిత్రదేశాలు ఇదే తరహాలో తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పాయి. అరౌరీ మృతి అనంతరం ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో తొమ్మిది మంది హెజ్బొల్లా మిలిటెంట్లు చనిపోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
‘ఇరాన్ పేలుళ్ల వేళ.. అమెరికాలో క్యాపిటల్ భవనాలకు బాంబు బెదిరింపులు’
సలేహ్ అరౌరీ హమాస్ అల్-కస్సం బ్రిగేడ్ వ్యవస్థాపకుల్లో ఒకడు. 2010 నుంచి హమాస్ పొలిట్బ్యూరో సభ్యుడు. ముఖ్యంగా ఇరాన్, హమాస్ మధ్య సంబంధాల బలోపేతంలో ఇతడి పాత్రే కీలకం. హమాస్ సంస్థను మట్టుపెట్టడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఇజ్రాయెల్.. లెబనాన్ రాజధాని బీరుట్లో డ్రోన్ దాడి ద్వారా అరౌరీని హతమార్చింది. ఈ దాడి గురించి మిత్రదేశమైన అమెరికాతోనూ ముందుగా పంచుకోలేదు.
తమ దాడుల్లోనే అరౌరీ మృతి చెందాడని ఇంతవరకు ఇజ్రాయెల్ ప్రకటించుకోలేదు. కానీ హమాస్, హెజ్బొల్లా, లెబనాన్ భద్రతా దళాలు మాత్రం ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. అరౌరీ మృతికి బదులు తీర్చుకుంటామని హెజ్బొల్లా ప్రకటించింది. మరోపక్క.. మిగిలిన బందీలు, కాల్పుల విరమణ కోసం జరుగుతోన్న చర్చలను హమాస్ నిలిపివేసింది. ఇప్పటికీ హమాస్ చెరలో 129 మంది బందీలుగా ఉన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!