NASA: అంతరిక్షంలో చనిపోతే.. భూమికి ఎలా తీసుకొస్తారో తెలుసా..!
అంతరిక్షం (space)లో అడుగుపెట్టడమంటే పెద్ద సాహసమే. పైగా ఇది ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. మరి.. మార్గమధ్యలో మరణిస్తే.. మృతదేహాన్ని భూమిపైకి ఎలా తీసుకువస్తారో తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షం (space)లో అడుగుపెట్టడమంటే పెద్ద సాహసమే. సుదీర్ఘకాలం శిక్షణ తరువాత అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. అంతరిక్షంలోని ఎన్నో రహస్యాలు, ఇతర గ్రహాలపై జీవుల మనుగడ తదితర అంశాలపై అన్వేషణ 60 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఈ ప్రయాణాల్లో ఇప్పటివరకు 20 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అంతరిక్ష యాత్రలు సర్వసాధారణంగా మారాయి.
భవిష్యత్తులో ఇతర గ్రహాలపై సెలవులను ఆస్వాదించే రోజులు కూడా రానున్నాయి. నాసా 2025 నాటికి చంద్రుడి పైకి తమ సిబ్బందిని పంపించేందుకు యోచిస్తోంది. దశాబ్ద కాలంలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, మార్గమధ్యలో ఎవరైనా చనిపోతే..? వారిని భూమికి ఎలా తీసుకొస్తారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నాసా ప్రోటోకాల్ ఏం చెబుతోందంటే..
అంగారకుడు, చంద్రుడిపై చనిపోతే..?
వాయేజర్-2 నుంచి అందుతున్న సంకేతాలు!
అంతరిక్షంలోకి ప్రయాణం ప్రారంభమయ్యాక భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఎవరైనా వ్యోమగాములు మరణిస్తే.. సిబ్బంది మృతదేహాన్ని స్పేస్ కాప్య్సూల్ ద్వారా భూమికి తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. దానిలో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక గది ఉంటుంది. శరీరానికి కావాల్సిన స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే, అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్ష నౌక, భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యల్లో మరణం సంభవిస్తే రోజుల వ్యవధిలో శరీరాన్ని తీసుకురాగలిగే వీలు ఉంటుంది. చంద్రుడిపై మరణం సంభవిస్తే మృతదేహాన్ని భూమి మీదకు తీసుకు వచ్చేందుకు కొన్ని రోజులు పడుతుంది. ఒక వేళ అంగారక గ్రహా యాత్రలో చనిపోతే.. మృతదేహాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఆ మిషన్ పూర్తి అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అంటే దేహాన్ని తీసుకువచ్చేందుకు కొన్ని ఏళ్లు కూడా పట్టే అవకాశం ఉంటుందని శాస్ర్తవేత్తలు వెల్లడించారు.
స్పేస్సూట్ లేకుండా అంతరిక్షంలో అడుగు పెడితే..
వ్యోమగామి స్పేస్సూట్ లేకుండా అంతరిక్షంలో అడుగుపెడితే తక్షణమే ప్రాణాలు కోల్పోతాడు.ఆక్సిజన్ లేకపోవడంతో మనిషి పీడనం కోల్పోతాడు. అంతేకాకుండా రక్తంలో వేడి పెరిగిపోతుంది. దీంతో కొద్ది క్షణాల్లోనే మరణం సంభవిస్తుంది.
ల్యాండ్ అయ్యాక మరణిస్తే..
భూమిపై శరీరాన్ని ఖననం చేస్తే.. కీటకాలు మృతదేహాన్ని కుళ్లింపజేస్తాయి. కానీ.. అంగారకుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యాక మరణిస్తే.. అప్పుడు ఏం జరుగుతుందంటే.. శరీరంలోని బాక్టీరియా వల్ల గ్రహ ఉపరితలం కలుషితమౌతుంది. అలాంటి సమయంలో మృతదేహాన్ని భూమికి తీసుకొచ్చేంత వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్లో భద్రపరచాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపాకు ఓటేశామని...ఉపాధి పనులు నిలిపివేశారు
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
-
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
-
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం