Maldives: ఆంక్షల సడలింపు.. మాల్దీవులకు బియ్యం, చక్కెర ఎగుమతికి భారత్ గ్రీన్సిగ్నల్
మాల్దీవుల(Maldives)కు నిత్యావసర వస్తువులైన బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు, గోధుమపిండి తదితర వస్తువులను ఎగుమతి చేసేందుకు భారత్ సిద్ధమైంది.
దిల్లీ: మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ముయిజ్జు.. మొదటినుంచి భారత్పై వ్యతిరేక వైఖరి అవలంబిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్ గౌరవిస్తోంది. ఈక్రమంలో మాల్దీవుల(Maldives)కు నిత్యావసర వస్తువుల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు, గోధుమపిండి వంటి వస్తువులను నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది.
లోక్సభ ఎన్నికల ముందు స్థానికంగా పెరుగుతోన్న నిత్యావసర ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా బియ్యం, చక్కెర, ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈక్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా వీటి ఎగుమతులపై మినహాయింపు ఇస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (DGFT) తెలిపింది.
Toxic Letters: పాకిస్థాన్ కోర్టుల్లో ‘విషపు లేఖల’ కలకలం..!
మాల్దీవులకు 1,24,218 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,09,162 టన్నుల గోధుమ పిండి, 64,494 టన్నుల చక్కెర, 21,513 టన్నుల బంగాళదుంప, 35,749 టన్నుల ఉల్లి, 42.75 కోట్ల కోడిగుడ్లు ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. వీటితోపాటు 10లక్షల టన్నుల కంకర, ఇసుక కూడా ఎగుమతి చేయనుంది. ఇదిలాఉంటే, చైనా అనుకూల పంథాను అనుసరిస్తోన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు.. భారత్తో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తమ భూభాగం నుంచి భారత సైనిక దళాలు వెళ్లిపోవాలంటూ మొదట్లో హెచ్చరించడం ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
సౌదీ అరేబియా నిర్మించనున్న కలల నగరం నియోమ్ వెనుక చీకటి కోణం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశం నుంచి పారిపోయిన కర్నల్ ఒకరు ఆంగ్లవార్తా సంస్థకు వెల్లడించారు. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
భారత వ్యక్తుల ప్రమేయంతో తమ గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపించిన వేళ.. మన దేశానికి రష్యా(Russia) అండగా నిలిచింది. అంతేగాక, భారత ఎన్నికల్లో అగ్రరాజ్యం జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని మాస్కో దుయ్యబట్టింది. -
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
Barron Trump: వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్న బ్యారన్ ట్రంప్ రాజకీయాల్లోకి రానున్నారు. పార్టీ కన్వెన్షన్కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు. -
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
-
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్
-
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
-
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..