Ukraine Crisis: రష్యా యుద్ధ వ్యూహం మారిందా? వెనక్కి తగ్గడంపై అగ్రరాజ్యం అనుమానం!
ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా వ్యూహం మార్చిందా? రాజధాని కీవ్ను వదిలి వెళ్తున్నట్టు ప్రకటించిన రష్యా బలగాలు.. ఇక కొత్త ప్రాంతాలపై దృష్టిసారించనున్నాయా?రష్యాను నమ్మలేమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం......
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా వ్యూహం మార్చిందా? రాజధాని కీవ్ను వదిలి వెళ్తున్నట్టు ప్రకటించిన రష్యా బలగాలు.. ఇక కొత్త ప్రాంతాలపై దృష్టిసారించనున్నాయా?రష్యాను నమ్మలేమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం ఇదేనా? ఉక్రెయిన్లో వేర్పాటువాద ప్రాంతాలపై రష్యా గురిపెట్టనుందా? రష్యా వ్యూహంపై అమెరికా, బ్రిటన్ పలు విశ్లేషణలు చేస్తున్నాయి.
ఉక్రెయిన్పై సైనిక చర్యతో ఆర్థికంగా, సైనికపరంగా భారీ నష్టాన్ని చవిచూస్తోన్న రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చినట్టు తెలుస్తోంది. నిన్న టర్కీలోని ఇస్తాంబుల్లో ఇరుదేశాల మధ్య జరిగిన శాంతి చర్చల దృష్ట్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై దాడుల్ని గణనీయంగా తగ్గించనున్నట్టు క్రెమ్లిన్ చేసిన ప్రకటన వెనుక మరో వ్యూహం ఉందని అమెరికా, బ్రిటన్ ఉక్రెయిన్ను హెచ్చరిస్తున్నాయి. కీవ్ను వదిలి ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాలపై రష్యా దృష్టిపెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు దాడి చేయని ల్వీవ్ నగరంపై మాస్కో సేనలు క్షిపణిదాడులు చేయడం ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. నిన్న జరిగిన శాంతి చర్చల్లోనూ కేవలం కీవ్, చెర్నిహివ్ నగరాల నుంచి మాత్రమే బలగాల్ని ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించింది. ఇతర ప్రధాన నగరాలైన మేరియుపోల్, సుమీ, ఖార్కివ్, ఖేర్సన్, మైకోలివ్ ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. అటు, కీవ్, చెర్న్హివ్ నుంచి రష్యా తమ బలగాల్ని ఉపసంహరించుకొని వాటిని వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్న డొనెట్స్క్, లుహాన్స్క్కు తరలించే అవకాశం ఉందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. దీంతో ఆ ప్రాంతాల్లో విస్తరణ వాదం ఊపందుకోనుందని ఆందోళన వ్యక్తంచేస్తోంది.
కీవ్లో రష్యా వెనక్కి తగ్గడంపై అగ్రరాజ్యం అమెరికా కూడా అనుమానం వ్యక్తంచేస్తోంది. రష్యా తమ బలగాల్ని ఉపసంహరించింది అనడం కంటే దారిమళ్లించింది అనడం సబబుగా ఉంటుందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం అధికారప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాలపై భారీగా దాడులు జరిగే అవకాశం కనబడుతోందని తెలిపారు. కీవ్కు కూడా పూర్తిగా ముప్పు తొలగిపోలేదన్నారు. అటు, కీవ్ సరిహద్దుల నుంచి రష్యా చాలా తక్కువ సంఖ్యలో బలగాల్ని కదిలిస్తోందని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం రష్యాను పూర్తిగా నమ్మలేమన్నారు. ఉక్రెయిన్ సైనికుల సాహసోపేత చర్యల వల్లే రష్యా వెనక్కి తగ్గిందన్నారు. పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదన్న జెలెన్స్కీ.. సవాళ్లు తొలగిపోలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?