Israel Hamas: పౌర మరణాలను తగ్గించడంలో విఫలమయ్యాం: నెతన్యాహు
గాజాలో ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో విఫలమయ్యామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.
టెల్అవీవ్: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు గాజాపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే యుద్ధం (Israel Hamas Conflict)లో పెద్దఎత్తున పౌర మరణాలు (Civilian Casualties) చోటుచేసుకుంటున్నాయి. సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu) మాట్లాడుతూ.. తమ సైన్యం గాజాలో పౌరులను రక్షించేందుకు చేయగలిగినదంతా చేస్తోందని తెలిపారు. అయితే.. ప్రాణనష్టాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా వేల మంది పాలస్తీనీయన్లను చంపడం.. కొత్త తరంలో ద్వేషాన్ని పెంచుతుందా? అని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు నెతన్యాహూ ఈ మేరకు స్పందించారు.
‘పౌర మరణాలు విషాదకరం. వాస్తవానికి.. ఇలాంటి ఘటనలు సంభవించకూడదు. ఎందుకంటే.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పౌరులకు ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకుగానూ చేయగలిగినదంతా చేస్తున్నాం. అయితే హమాస్ ఉగ్రవాదులే వారిని ముప్పు ముంగిట ఉంచుతున్నారు’ అని నెతన్యాహు ఆరోపించారు. ‘పౌర మరణాలను నివారించేందుకు.. ముందస్తు హెచ్చరికగా కరపత్రాలు చేరవేస్తున్నాం. యుద్ధక్షేత్రం నుంచి తరలివెళ్లాలని సెల్ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తున్నాం. దీంతో చాలా మంది వెళ్లిపోయారు’ అని తెలిపారు. ఇటీవల దక్షిణ గాజాలోని పౌరులను కూడా స్వీయ భద్రత కోసం ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ కరపత్రాలను జారవిడిచిన విషయం తెలిసిందే. అయితే.. వారిని ఎక్కడికి తరలివెళ్లాలని సూచించిందో స్పష్టంగా తెలియలేదు.
‘అల్-షిఫా’ కింద బయటపడ్డ సొరంగం..!
యుద్ధం ప్రారంభంలోనూ.. ఉత్తర గాజాలోని పౌరులను దక్షిణం వైపు వెళ్లమని ఇజ్రాయెల్ సూచించింది. దీంతో లక్షల మంది పాలస్తీనీయన్లు తరలివెళ్లారు. అప్పటికే గాజాను దిగ్బంధం చేయడంతో స్థానికంగా మానవతా సంక్షోభం తలెత్తింది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, ఇంధనం తదితరాల కొరతతో గాజావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పరిస్థితి దిగజారింది. మరోవైపు ఇజ్రాయెల్ బలగాలు గాజాలో దాడులు, తనిఖీలు కొనసాగిస్తున్నాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్-షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతోన్న భీకర దాడుల్లో ఇప్పటివరకు 11,500 మందికిపైగా పౌరులు మృతి చెందినట్లు నివేదికలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం