Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభం.. ఖాళీ కానున్న డీజిల్ బంకులు..!
ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలను ఎదుర్కొంటున్న శ్రీలంక, రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను చవిచూచే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత్ సహాయాన్ని భారీగా వినియోగించుకుంటున్న పొరుగుదేశం
కొలంబో: ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలను ఎదుర్కొంటున్న శ్రీలంక.. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను చవిచూచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు పొంచి వున్నాయనే వార్తలు శ్రీలంక వాసులను వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో ఇంధన సంక్షోభం నుంచి గట్టేక్కిచేందుకు 500 మిలియన్ డాలర్ల విలువైన చమురును లైన్ ఆఫ్ క్రెడిట్గా భారత్ అందిస్తోంది. దీన్ని శ్రీలంక వేగంగా వినియోగించుకుంటోంది. మరికొన్ని రోజుల్లోనే ఇవి కూడా తరిగిపోనున్నాయి. ఒకవేళ భారత్ నుంచి ఈ సహాయం కొనసాగింపు పొందకపోతే ఏప్రిల్ నెలాఖరు నాటికి శ్రీలంకలో డీజిల్ బంకులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభంతో భారత్ ఇంధన సహాయాన్ని అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఇంధనం సరఫరా కావాల్సి ఉన్నప్పటికీ.. అక్కడి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మార్చి చివరివారం నుంచే వాటి సరఫరా మొదలుపెట్టింది. ఏప్రిల్ 15, 18, 23 తేదీల్లో మరిన్ని దఫాల్లో శ్రీలంకకు ఇంధనం సరఫరా చేయనుంది. అయితే భారత్ చేస్తోన్న ఈ సాయం ఏప్రిల్ చివరి నాటికి కూడా సరిపోక పోవచ్చన్ని అంచనా. ఆ తర్వాత కష్టాలు గట్టెక్కాలంటే మరోసారి శ్రీలంక భారత్ సహాయం తీసుకోవాల్సిందే.
దేశవ్యాప్తంగా ప్రజా రవాణాతోపాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీలంకకు భారీ స్థాయిలో డీజిల్ అవసరం. అయితే, ఇంధన కొరత ఏర్పడడంతో ఇప్పటికే కొన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేశారు. దీంతో నిత్యం పది గంటలపాటు విద్యుత్ కోతలు తప్పడం లేదు. ఇక దేశంలో ఉన్న ఒకేఒక రిఫైనరీ కూడా పనిచేసే పరిస్థితుల్లో లేదు. దిగుమతులకు చెల్లింపులు చేయలేక గత నవంబరులో రెండుసార్లు మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పొరుగుదేశం శ్రీలంక.. భారత్ సహాయంపై ఆధారపడాల్సి వచ్చింది.
గార్మెంట్ రంగం కుదేలు..
అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్ మార్కెట్లకు శ్రీలంక భారీ స్థాయిలో వస్త్రాలను ఎగుమతి చేస్తోంది. దేశ జీడీపీలో వీటి వాటా 6శాతం ఉందంటే అవి ఎంత కీలకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, విద్యుత్ కొరత వల్ల గార్మెంట్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటున్నట్లు పరిశ్రమ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గంటలపాటు కరెంటు కోతలతో చిన్నతరహా పరిశ్రమలు మూత పడుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ అంశంపై అధ్యక్షుడితో చర్చేందుకూ సిద్ధమయ్యాయి.
వేధిస్తోన్న ఔషధాల కొరత..
మరోవైపు దేశంలో నెలకొన్న సంక్షోభం వైద్యరంగంపైనా పడింది. ముఖ్యంగా అత్యవసర ఔషధాల కొరత శ్రీలంకను వేధిస్తోంది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాధారణ సర్జరీలను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఔషధాలు, వైద్య పరికరాలతోపాటు రియేజెంట్ల కొరత ఏర్పడుతోందని శ్రీలంక మెడికల్ అసోసియేషన్ (SLMA) అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఇలా నిత్యం గంటలపాటు విద్యుత్ కోతలు, గ్యాస్, ఆహారంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల కొరత శ్రీలంక వాసులను వేధిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీస్థాయిలో నిరసనలు చేపడుతున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే, ఈ నిరసనలు రాజకీయ ప్రేరేపితంగా పేర్కొంటోన్న ప్రభుత్వం.. అధ్యక్షుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న శ్రీలంకకు సహాయాన్ని ప్రకటించిన భారత్.. ఇంధన కొనుగోలు కోసం 500మిలియన్ డాలర్ల రుణపరిమితిని అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్