Long Social Distancing: కొవిడ్ నేర్పిన పాఠాలు.. యువతలో మారిన అలవాట్లు
యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోని నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.
వైరస్ ఉద్ధృతి తగ్గినా నిబంధనలు పాటిస్తున్న పౌరులు
లండన్: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఓ వైపు కొవిడ్ ఆంక్షలు, నిబంధనలు తొలగిపోవడం, కేసుల సంఖ్య తగ్గడం, వ్యాక్సిన్లు, బూస్టర్లు అందుబాటులోకి రావడంతో ప్రజలందరూ సాధారణ అలవాట్లవైపు తిరిగి చూస్తున్నారు. కేవలం ప్రజారవాణా, ప్రైవేటు కార్యాలయాలు మినహా మిగతా అన్ని కార్యక్రమాలను కొవిడ్ కంటే ముందున్న మాదిరిగా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారి నేర్పిన పాఠాలను గుర్తుంచుకొని తమ అలవాట్లను కొనసాగించే ప్రయత్నం కనిపిస్తోంది. దీన్నే ప్రస్తుతం లాంగ్ సోషల్ డిస్టాన్సింగ్గా పేర్కొంటున్నారు.
లాంగ్ సోషల్ డిస్టాన్సింగ్..
ఉదాహరణకు బ్రిటన్లో మూడో వంతు ప్రజలు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉంటున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరో మూడో వంతు మంది మాత్రం కుటుంబేతరులతో కలిసినప్పుడు భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తున్నామని చెబుతున్నారు. యాభై శాతానికి పైగా ప్రజలు పలు సందర్భాల్లో మాస్కులు ధరిస్తున్నారు. కొవిడ్ తగ్గినప్పటికీ నిబంధనలు పాటించే మార్పునే లాంగ్ సోషల్ డిస్టాన్సింగ్ (Long Social Distancing)గా అభివర్ణిస్తున్నారు. అయితే, ఇది కేవలం బ్రిటన్కు మాత్రమే పరిమితం కాలేదు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ దేశాల్లో ప్రతి పది మందిలో నలుగురు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక మహమ్మారి ముగిసిన తర్వాత భౌతిక దూరాన్ని పాటిస్తామని 13శాతం అమెరికన్లు పేర్కొనగా.. 46శాతం మంది సాధారణ కార్యకలాపాలకు పాక్షికంగా వస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు లాంగ్ సోషల్ డిస్టాన్సింగ్ను ఎవరు పాటిస్తున్నారో ఓసారి లుక్కేద్దాం.
* ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారితోపాటు శారీరక వైకల్యం ఉన్నవారు లాంగ్ సోషల్ డిస్టాన్సింగ్ను కచ్చితంగా పాటిస్తున్నారు. కొవిడ్తో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయనే కారణంగా తాము సాధారణ స్థితికి రాలేమని బలంగా విశ్వసిస్తున్నారు.
* కొవిడ్ ముప్పు అధికంగా ఉన్న 70ఏళ్ల వయసు పైబడిన వారు మాస్కులు ధరిస్తున్నారు. అయితే, భౌతికదూరం, మాస్కులు ధరించడంలో వృద్ధులకంటే మధ్య వయస్కులు కాస్త వెనుకబడి పోయినట్లు బ్రిటన్ గణాంకాలు చెబుతున్నాయి.
* వృద్ధులతో పోలిస్తే యువకులు త్వరగా సామాజిక కార్యకలాపాల్లో వేగంగా పాలుపంచుకుంటున్నారు.
* ఒమిక్రాన్ వేవ్ తగ్గుముఖం పట్టిన వెంటనే తమ స్నేహితులను కలుసుకున్నట్లు 80శాతం (18-29 మధ్య వయసున్న) యువత పేర్కొంది. కాగా పెద్దవాళ్లలో మాత్రం 60 నుంచి 70 మంది మాత్రమే తమ మిత్రులను కలుసుకున్నామని చెప్పారు.
* 16-29 ఏళ్ల యువతలో 16శాతం మంది ఇంకా భౌతిక దూరం కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పగా.. 40శాతం మంది ఏదో ఒక సమయంలో మాస్కు ధరిస్తున్నట్లు వెల్లడించారు
యువతను వెంటాడిన సవాళ్లు..
* మహమ్మారి సమయంలో ఎక్కువ నిందలు యువతపైనే వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, మహమ్మారి వేళ నిబంధనలు అతిక్రమించిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నట్లు మరిన్ని సర్వేలు పేర్కొన్నాయి.
* గడిచిన రెండేళ్లలో సాధారణంగా జీవితంపై సంతృప్తి వ్యక్తం చేసిన వాళ్లలో వృద్ధులతో పోలిస్తే యువత శాతం తక్కువగా ఉంది
* మహమ్మారి సమయంలో మానసిక సమస్యలు యువతలోనే అధికం. ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువ మద్యం సేవించడం, సరైన వ్యాయామం చేయకపోవడం వంటివి కారణాలతో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది
* ఆందోళన, తీవ్ర ఒత్తిడి వంటి సమస్యలు కూడా యువతోనే ఎక్కువగా కనిపించాయి. ఇలా కొవిడ్ మహమ్మారి ఉద్ధతి తగ్గుతోన్న సమయంలో సాధారణ కార్యకలాపాలకు రావడంతో యువత, వృద్ధుల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?