Healthy Diet: 71% భారతీయులకు ఆరోగ్యకరమైన ఆహారమే అందడం లేదా..?
దేశంలో 71శాతం ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది.
సీఎస్సీ తాజా నివేదిక
దిల్లీ: దేశంలో 71శాతం ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కలిగే వ్యాధుల వల్ల ప్రతి ఏటా 17లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది. ‘భారత్లో పర్యావరణ పరిస్థితి-2022’ పేరుతో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE), డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో దేశంలో పొషకాహార వివరాలను వెల్లడించింది.
ఆహారానికి సంబంధించిన వ్యాధుల్లో శ్వాసకోశ జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు వంటివి చాలా తక్కువ మోతాదులో తీసుకుంటుండగా.. శుద్ధిచేసిన మాంసం, రెడ్ మాంసం, చక్కెర మోతాదు అధికంగా ఉండే శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 71శాతం భారతీయులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతుండగా ప్రపంచ సరాసరి 42శాతంగా ఉందని పేర్కొంది. సగటు భారతీయుడి ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాల వంటివి సరైన మోతాదులో ఉండడం లేదని.. చేపలు, పాల పదార్థాలు, మాంసం మాత్రం ఆశించిన స్థాయిలోనే ఉన్నాయని వెల్లడించింది.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే..?
వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం, ఓ వ్యక్తి తన ఆదాయంలో 63శాతానికి మించి ఆహారానికి ఖర్చుచేయాల్సి వస్తే దాన్ని భరించలేనిదిగా పరిగణిస్తారు. భారత్లో 20ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి రోజుకు 200గ్రాముల పండ్లు తీసుకోవాల్సి ఉండగా.. కేవలం 35.8గ్రాములు మాత్రమే తీసుకుంటున్నాడు. అదే కూరగాయల విషయానికొస్తే రోజుకు 300గ్రాములు తినాల్సి ఉండగా.. 168.7గ్రాములు తీసుకోగలుగుతున్నాడు. ఇక పప్పుదినుసులు 100గ్రాములు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ 24.9గ్రాములు, గింజలు 13శాతం మాత్రమే తీసుకుంటున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, వీటిలో కొంత పురోగతి ఉన్నప్పటికీ పూర్తిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రం తీసుకోలేకపోతున్నారని తెలిపింది.
మరోవైపు ఆహార ధరలనూ తాజా నివేదిక విశ్లేషించింది. గడిచిన ఒక్క ఏడాదిలోనే వినియోగదారుల ఆహార ధరల సూచిక (CFPI)లో 327శాతం పెరుగుదల కనిపించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో వినియోగదారుల ధరల సూచిక (CPI) మాత్రం 84శాతం పెరిగినట్లు తెలిపింది. ధరల పెరుగుదల్లో ఆహారానికి సంబంధించినవే అధికంగా ఎగబాకాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతుండడం, అంతర్జాతీయంగానూ పంటల ధరలు పెరగడం, వాతావరణ మార్పులతో ఏర్పడే పరిస్థితుల వల్ల ఆహార పదార్థాల ధరలకు రెక్కలు వచ్చాయని తెలిపింది. ఇక ఆహార ధరల పెరుగుదల రేటు పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉందని డౌన్ టు ఎర్త్ మేనేజింగ్ ఎడిటర్ రిచర్డ్ మహాపాత్ర వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు