Microsoft: యూరప్ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై చైనా హ్యాకర్ల పంజా!
గూఢచర్యంలో భాగంగా పశ్చిమ యూరప్ (Europe)లోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఈ-మెయిల్ ఖాతాలపై చైనా (China) హ్యాకర్ల బృందం సైబర్ దాడి (Cyber Attack) చేసిందని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆరోపించింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ యూరప్ (Europe)లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు లక్ష్యంగా చైనా (China) హ్యాకర్లు సైబర్ దాడి (Cyber Attack)కి పాల్పడినట్లు మైక్రోసాఫ్ట్ (Microsoft) తన బ్లాగ్లో ఆరోపించింది. సుమారు 25కి పైగా సంస్థల వెబ్సైట్లు, ఈ-మెయిల్ ఖాతాలపై చైనాకు చెందిన స్ట్రోమ్-0558 అనే హ్యాకర్ల ముఠా సైబర్ దాడి చేసినట్లు వెల్లడించింది. గత వారం కొంతమంది యూజర్లు తమ ఈ-మెయిల్ ఖాతాలు అసాధారణ రీతిలో పనిచేస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో మైక్రోసాఫ్ట్ విచారణ జరపగా.. హ్యాకింగ్ జరిగినట్లు నిర్ధారణ అయింది.
‘‘ముఖ్యమైన సమాచార సేకరణ, గూఢచర్యంలో భాగంగా పశ్చిమ యూరప్లోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఈ-మెయిల్ ఖాతాలను చైనాకు చెందిన హ్యాకర్ల బృందం యాక్సెస్ చేసినట్లు గుర్తించాం’’ అని మైక్రోసాఫ్ట్ భద్రతా విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చార్లీ బెల్ తెలిపారు. మరోవైపు అమెరికా అధికారులు సైతం సైబర్ దాడిని ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఉన్న కొన్ని యూరోపియన్ ఈ-మెయిల్ ఖాతాలపై చైనా సైబర్ ముఠా దాడి చేసిందని చెప్పినట్లు తెలిపింది.
‘‘సైబర్ దాడి జరిగిన ఈ-మెయిల్ ఖాతాల భద్రతను మెరుగుపరిచాం. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీతోపాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి పనిచేస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ సైతం ఈ దాడిని ధ్రువీకరించారు. అయితే, దీనిపై విచారణ జరుగుతోందని, మరింత సమాచారం కోసం మైక్రోసాఫ్ట్ను సంప్రదించినట్లు తెలిపారు.
అమెరికానే పెద్ద హ్యాకర్: చైనా
మైక్రోసాఫ్ట్ ఆరోపణలను చైనా ఖండించింది. అమెరికా సైబర్ కార్యకలాపాలు బయటపడకుండా ఉండేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించింది. ‘‘అది పూర్తిగా తప్పుడు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద హ్యాకర్ అమెరికానే. గత ఏడాది కాలంగా చైనా సహా మరెన్నో దేశాలు అమెరికా ప్రభుత్వం సైబర్ గూఢచర్యం గురించి ఎన్నో నివేదికలను బయపెట్టాయి. వాటిపై ఇప్పటివరకు అమెరికా స్పందించలేదు’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు.
చైనా హ్యాకర్లు ఇలాంటి చర్యలకు పాల్పడం ఇదేం తొలిసారి కాదు. గత నెలలో కూడా చైనా హ్యాకర్లు ఆ దేశ ప్రభుత్వ అండతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వందల కొద్దీ సంస్థలపై సైబర్ దాడికి పాల్పడినట్లు గూగుల్కు చెందిన సైబర్ భద్రత సంస్థ మాండియంట్ తెలిపింది. అంతకముందు అమెరికా మిలిటరీ స్థావరాలకు చెందిన వెబ్సైట్ సహా పలు కీలక సైట్లను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. అప్పట్లో దీనిపై అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ, ఎఫ్బీఐ, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్లోని సంబంధిత సంస్థలు సైతం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!