Chip war: చైనాకు డచ్ ప్రభుత్వం షాక్..!
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలో కొత్త దశ మొదలైంది. కంప్యూటర్ చిప్ల తయారీకి అత్యంత కీలకమైన లిథోగ్రఫీ యంత్రాలను చైనాకు విక్రయించకుండా నెదర్లాండ్స్ చర్యలు చేపట్టింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA)-చైనా(china) మధ్య మొదలైన చిప్ యుద్ధంలో మరో దేశం వచ్చి చేరింది. ఐరోపాలోని నెదర్లాండ్ ఈ ఏడాది వేసవి ముందు నుంచి అత్యాధునిక చిప్స్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని పేర్కొంది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు డచ్ ప్రభుత్వం వెల్లడించింది. వీటిల్లో అత్యంత కీలకమైన ఏఎస్ఎంల్ సంస్థ అభివృద్ధి చేసిన చిప్ టెక్నాలజీ కూడా ఉండనుంది. ప్రపంచ చిప్స్ తయారీ విభాగంలో ఏఎస్ఎంల్ చాలా ముఖ్యమైన సంస్థ. దీంతో ఫోన్ల నుంచి ఆయుధాల వరకు ఉపయోగించే సెమీకండక్టర్ల తయారీలో ముఖ్యమైన దశలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ‘‘నెదర్లాండ్స్ జాతీయ, అంతర్జాతీయ భద్రతను దృష్టిలోపెట్టుకొని వీలైనంత తర్వగా ఈ టెక్నాలజీని నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తోంది. సాంకేతిక అభివృద్ధి, భౌగోళిక రాజకీయాల కోణంలోనే ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నారు’’ అని ఆ దేశ వాణిజ్య మంత్రి లీస్జే ష్రైనెమెకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె చట్టసభ సభ్యులకు లేఖ రాశారు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు అత్యాధునిక లిథోగ్రఫీ టెక్నాలజీని ఎగుమతి చేసే సమయంలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఏఎస్ఎంఎల్ సంస్థ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మా అత్యాధునిక ఇమ్మెర్షన్ డీయూవీ సిస్టమ్స్పైనే ఈ ఆంక్షల ప్రభావం ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు బేరీజు వేసుకొంటే మా ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు’ అని పేర్కొంది.
2019లో డచ్ ప్రభుత్వం ఏఎస్ఎంఎల్ నుంచి అత్యాధునిక లిథోగ్రఫీ యంత్రాలను చైనాకు విక్రయించకుండా అడ్డుకొంది. మరోవైపు గతేడాది అక్టోబర్లో అమెరికా సరికొత్త లైసెన్సింగ్ విధానం తెచ్చింది. అమెరికా పరికరాలు, సాంకేతికత ఉపయోగించి తయారు చేసిన చిప్స్ను చైనాకు విక్రయించే కంపెనీలు తొలుత తమ వద్ద అనుమతులు తీసుకోవాలని వాషింగ్టన్ ప్రకటించింది. అదే సమయంలో నెదర్లాండ్స్, జపాన్ కూడా ఇదే విధానం అనుసరించాలని అమెరికా ఒత్తిడి చేసింది.
వాణిజ్య యుద్ధంలో సెమీకండెక్టర్ అత్యంత కీలక ఆయుధం. ఏఎస్ఎంల్ సంస్థ చైనాలోని సెమీకండక్టర్ మాన్యూఫాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్ప్కు ఈయూవీ యంత్రాలు విక్రయించకుండా ఆపేశారు. వాస్తవానికి ఏఎస్ఎంల్కు ఈయూవీ యంత్రం తయారీకి 5,000 మంది సరఫరా సంస్థలు ఉన్నాయి. వీటిలో అమెరికా కంపెనీలు కూడా ఉన్నాయి. 2019లో ట్రంప్ కార్యవర్గం డచ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి అత్యాధునిక ఈయూవీ యంత్రాల్ని విక్రయించడానికి అనుమతులు మంజూరు కానివ్వలేదు. దీంతో పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే చైనా అత్యంత సూక్ష్మ సెమీకండక్టర్ల విషయంలో బాగా వెనుకపడిపోయే పరిస్థితి తలెత్తింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్