Bangladesh: మా సమస్య భారత్ పరిష్కరించగలదు: బంగ్లాదేశ్ ప్రధాని
లక్షల మంది రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి సమస్యాత్మకంగా మారారని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పేర్కొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: లక్షల మంది రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి సమస్యాత్మకంగా మారారని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యను భారత్ పరిష్కరించగలదన్నారు. శరణార్థులు లక్షల్లో ఉండటంతో దేశంలో అంతర్గతంగా సవాళ్లు తలెత్తుతున్నాయన్నారు. కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ చాలా సాయం చేసిందన్నారు.
‘‘అది భారమని మాకు తెలుసు. భారత్ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో చర్చలు జరుపుతున్నాం. మానవీయ కోణంలోనే మేము వారికి ఆశ్రయం ఇచ్చాం. కొవిడ్ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించాం. కానీ, వారు ఏన్నాళ్లుంటారు. అందుకే వారిని క్యాంపులో ఉంచాం. అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు మాదకద్రవ్యాల, మహిళల అక్రమ రవాణలకు పాల్పడుతున్నారు. వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే మాకు, మయన్మార్కు అంత మంచిది. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్, యూఎన్వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నాం. కానీ, భారత్ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను’’ అని షేక్ హసీనా పేర్కొన్నారు.
తీస్తా నది జలాల పంపకాల విషయంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య సమన్వయంపై కూడా హసీనా మాట్లాడారు. తీస్తా నది విషయంలో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. భారత ప్రధాని కూడా ఇందుకు చాలా సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తమ విద్యార్థులు పలువురిని భారత్ స్వస్థలాలకు చేర్చిందన్నారు. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ మైత్రి రూపంలో సహాయపడిందని గుర్తు చేసుకొన్నారు. హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్లో అధికారిక పర్యటన జరపనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రంప్తో ఏకాంతంగా గడిపా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.