Pegasus: ఇజ్రాయెల్‌ పోలీసులు పెగాసస్‌తో ఫోన్లను హ్యాక్‌ చేశారు!

పెగాసస్‌ స్పైవేర్‌కు సంబంధించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఓ మీడియా సంస్థ సంచలన విషయాలను బయటపెట్టింది. ఇజ్రాయెల్‌ పోలీసులు ఈ స్పైవేర్‌ను ఉపయోగించి ఆ దేశంలోని డజన్ల కొద్ది ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేసిందంటూ తన కథనంలో రాసుకొచ్చింది. హ్యాక్‌కు

Published : 08 Feb 2022 01:20 IST

జెరూసలెం: పెగాసస్‌ స్పైవేర్‌కు సంబంధించి ఇజ్రాయెల్‌కు చెందిన ఓ మీడియా సంస్థ సంచలన విషయాలను బయటపెట్టింది. ఇజ్రాయెల్‌ పోలీసులు ఈ స్పైవేర్‌ను ఉపయోగించి ఆ దేశంలోని డజన్ల కొద్ది ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేసిందంటూ తన కథనంలో రాసుకొచ్చింది. హ్యాక్‌కు గురైన వారిలో దేశ మాజీ ప్రధాని బెంజ్‌మిన్‌ నెతన్యాహు కుమారుడు, పలువురు సామాజిక కార్యకర్తలు, సీనియర్‌ ప్రభుత్వాధికారులు ఉన్నారని పేర్కొంది.

మీడియా సంస్థ కథనంపై స్పందించిన పోలీస్‌ కమిషనర్‌ కోబి షాబ్తాయ్‌.. దీనిపై ఒక న్యాయమూర్తి నేతృత్వంలో అంతర్గత, స్వతంత్ర విచారణ జరిపించాలని ప్రజాభద్రత మంత్రి ఒమర్‌ బర్లేవ్‌ను కోరారు. విచారణలో అవకతవకలను గుర్తించినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ కోబి తెలిపారు. 

పెగాసస్‌ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ రూపొందించింది. కాగా.. ఈ స్పైవేర్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రభుత్వాలు అక్రమంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీని ఇతర దేశాలకు విక్రయించడాన్ని రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు. దీని వల్ల వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతుందంటున్నారు. భారత్‌లోనూ గత కొన్నాళ్లుగా పెగాసస్‌ వివాదం కొసాగుతూనే ఉంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పలువురు ప్రముఖులపై భాజపా ప్రభుత్వం స్పైవేర్‌ను ఉపయోగిస్తుందని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఇటీవల ఓ సాంకేతిక కమిటీని సైతం నియమించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని