Pakistan: తాత్కాలిక ప్రధానిగా మాజీ సీజేపీని నామినేట్ చేసిన ఇమ్రాన్..!
పాకిస్థాన్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల చట్టబద్ధతపై సహేతుక ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం పేర్కొంది.
రాజకీయ సంక్షోభంపై విచారణ మొదలుపెట్టిన పాక్ సుప్రీంకోర్టు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కోకుండా జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ విపక్షాలు చేసిన వాదనపై సుప్రీం కోర్టు విచారణ మొదలుపెట్టింది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల చట్టబద్ధతపై సహేతుక ఉత్తర్వులు ఇస్తామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం పేర్కొంది. అనంతరం విచారణను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మరోవైపు తాత్కాలిక ప్రధానమంత్రి నియామకం జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్ ఆ బాధ్యతల్లో కొనసాగుతారన్న అధ్యక్ష భవనం.. అభ్యర్థులను నామినేట్ చేయాలని అధికార, ప్రతిపక్ష నాయకులకు సూచించింది. ఇందులో భాగంగా తమ అభ్యర్థులను సూచించే పనిలో ఇరువర్గాలు నిమగ్నమయ్యాయి.
అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ముందే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్.. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీంతో మూడు నెలల్లోపు ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటివరకు తాత్కాలిక ప్రధానమంత్రిని ఎంపిక చేసే ప్రక్రియను అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా అభ్యర్థులను సిఫార్సు చేయాలని అధికార, ప్రతిపక్ష నాయకులకు లేఖ రాశారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించాలని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడికి సిఫార్సు చేశారు. ప్రతిపక్ష నాయకుడి నుంచి స్పందన రావాల్సి ఉంది.
పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం, సంక్షోభ సమయంలో తాత్కాలిక ప్రధానమంత్రిని నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఇందుకోసం ప్రధానమంత్రితోపాటు నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను సంప్రదించాలి. ఈ క్రమంలోనే ఇరువురు నాయకులకు లేఖలు రాసినట్లు పాకిస్థాన్ అధ్యక్ష భవనం వెల్లడించింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ తమ తరపున పేరును ప్రతిపాదించగా.. మూడు రోజుల్లో ప్రతిపక్ష నేత తన మద్దతుదారుల పేర్లు తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు సిఫార్సు చేయకుంటే.. ఉన్నవారిలోనే ఒకరిని ఆపద్ధర్మ ప్రధానిగా అధ్యక్షుడు ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రధాని ఇమ్రాన్, అధ్యక్షుడు ఆరిఫ్ చర్యలను ప్రతిపక్షనేత మహ్మద్ షెహబాజ్ తప్పుబడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?