Schengen Visa : మరింత వేగంగా జర్మనీ షెంజెన్ వీసా ప్రక్రియ.. వెల్లడించిన రాయబార కార్యాలయం
జర్మనీ (Germany) షెంజెన్ వీసా (Schengen Visa) జారీ ప్రక్రియ సమయం తగ్గించినట్లు ఆ దేశ రాయబార కార్యాలయం తెలిపింది. భారత్ నుంచి (Indians) యూరప్ (Europe) ప్రయాణాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
దిల్లీ : భారతీయుల (Indians) కోసం జర్మనీ (Germany) జారీ చేస్తున్న షెంజెన్ వీసా (Schengen Visa) ప్రక్రియ సమయం ఎనిమిది వారాలకు తగ్గించినట్లు జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎన్జ్వైలర్ తెలిపారు. ఆ గడువును మరింత కుదించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ‘వీసా ఒక ముఖ్యమైన అంశం. మేము దరఖాస్తులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకు వివిధ మార్గాల ద్వారా కృషి చేస్తున్నాం. ముంబయిలో మా సిబ్బంది సంఖ్యను పెంచాం. దాంతో వీసా కోసం వేచి చూసే సమయం గణనీయంగా తగ్గనుందని’ జార్జ్ చెప్పారు.
భద్రతా ప్రమాణాలపై అధికారుల సంతృప్తి.. మళ్లీ పట్టాలెక్కిన హ్యారీ పోటర్ రైలు!
విదేశాల్లో భారతీయ పర్యాటకులు స్వల్పకాలం బస చేయడానికి షెంజెన్ వీసా ఇస్తారు. గరిష్ఠంగా 90 రోజుల వరకు అక్కడ ఉండవచ్చు. ఈ వీసా లభించినట్లయితే ఐరోపాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన 27 దేశాల్లో ఏ దేశానికైనా వెళ్లొచ్చు. పర్యాటకం, వ్యాపారం నిమిత్తం వెళ్లేవారికి ఈ తరహా వీసాలు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ జారీ ఆలస్యం కారణంగా ఇటీవలి కాలంలో భారత్ నుంచి యూరప్ ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. జర్మన్ నేషనల్ టూరిస్టు బోర్డు గణాంకాల ప్రకారం.. 2022లో భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 209 శాతం అధికం. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య ఇంకా 65 శాతం వద్దే ఉంది.
షెంజెన్ వీసాలకు అధిక డిమాండ్ ఏర్పడటంతో అపాయింట్మెంట్, ప్రాసెసింగ్ కోసం ఎక్కువ సమయం పడుతున్నట్లు గత ఏప్రిల్లో జర్మన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో జర్మనీ వెళ్లాలనుకునేవారు తమ ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్ వీఎఫ్ఎస్తో ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని అందులో పేర్కొంది. కాన్సులేట్ వద్దకు దరఖాస్తు వచ్చిన తరువాతనే వీసా జారీ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించింది. డెలివరీ సమయం, సెలవులను పరిగణనలోకి తీసుకొంటే అది కొన్నిసార్లు ఆరు రోజులు కూడా పట్టొచ్చని రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM