Imran khan: ఇమ్రాన్కు ఇంటిదారి చూపింది ఈ నలుగురే..!
ఇంటిదారి పట్టించడంలో నలుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వారెవరో చూద్దాం....
ఇస్లామాబాద్: తాను చెప్పినట్లుగానే పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకూ ఆడారు. కానీ.. విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. తుదకు ప్రతిపక్షాల పటిష్ఠ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయి వెనుదిరిగారు. రాజీనామాకు ససేమిరా అన్న ఇమ్రాన్ చివరకు జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. ఆయన్ని ఇంటిదారి పట్టించడంలో నలుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వారెవరో చూద్దాం...
షెహబాజ్ షరీఫ్..
షెహబాజ్ (70) ప్రస్తుతం పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అధినేతగా ఉన్నారు. అవినీతి కుంభకోణాల్లో దోషిగా తేలి ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఈయన స్వయానా సోదరుడు. తర్వాత ప్రధానిగా ఈయనే బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అభ్యుదయ కవితా పంక్తులను విసురుతూ ప్రసంగాల్ని రక్తికట్టిస్తారన్న పేరుంది. పలు వివాహాలు, లండన్, దుబాయ్లో విలాసవంతమైన భవంతుల వంటి ఆరోపణలతో పలుసార్లు పతాకశీర్షికలకెక్కారు.
అసిఫ్ అలీ జర్దారీ..
ఈయన సంపన్న సింధ్ కుటుంబం నుంచి వచ్చారు. గతంలో ప్లేబాయ్ జీవితం గడిపేవారన్న పేరుండేది. తర్వాత కుటుంబ పెద్దల నిర్ణయంతో బెనజీర్ భుట్టోను వివాహమాడారు. సరిగ్గా ఆమె తొలిసారి ప్రధాని కావడానికి కొన్ని నెలల ముందే వీరి పెళ్లి జరిగింది. ఈయన సరదా కోసం రాజకీయాలకు వచ్చారన్న విమర్శ ఉంది. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 10 శాతం కమీషన్ డిమాండ్ చేసేవారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. అందుకే ఈయనను ‘‘మిస్టర్ టెన్ పర్సెంట్’’గా వ్యవహరించేవారు. అవినీతి ఆరోపణలతో పలుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. 2007లో భుట్టో హత్య తర్వాత పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) సహ-ఛైర్మన్గా వ్యవహరించారరు. తర్వాత పీఎంఎల్-ఎన్తో అధికారాన్ని పంచుకొని అధ్యక్ష పదవిని చేపట్టారు.
బిలావల్ భుట్టో జర్దారీ..
అసిఫ్ అలీ జర్దారీ, బెనజీర్ భుట్టో కొడుకే ఈ బిలావల్ భుట్టో జర్దారీ. తల్లి హత్య తర్వాత కేవలం 19 ఏళ్ల వయసులోనే పీపీపీ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఆక్స్ఫర్డ్లో విద్యనభ్యసించిన ఈయనకు ప్రగతిశీల నాయకుడిగా పాక్లో పేరుంది. మహిళలు, మైనారిటీల హక్కులపై తరచూ మాట్లాడుతుంటారు. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటారు. దీంతో ఈయనకు యువ ఓటర్లలో మంచి ఆదరణ ఉంది. అయితే, పాక్ జాతీయ భాష అయిన ఉర్దూపై పట్టులేకపోవడంతో పలుసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.
మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్..
కఠినమైన ఇస్లామిక్ నేతగా మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ పాక్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ, తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. సౌమ్యుడిగా ముద్ర వేయించుకునేందుకు తెగ ప్రయత్నించారు. అందుకోసం పలు లౌకిక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. తరచూ మదర్సాల్లోని విద్యార్థులను మొబిలైజ్ చేయడం ద్వారా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు. కానీ, అధికారం చేపట్టే శక్తిని మాత్రం ఇప్పటి వరకు కూడగట్టుకోలేకపోయారు. కానీ, చాలా ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇమ్రాన్ ఖాన్తో తీవ్ర వైరం ఉండేది. ఆయన్ని ఓ సందర్భంలో యూదుడిగా సంబోధించారు. ఖాన్ ప్రతిగా రెహ్మాన్ను ‘ముల్లా డీజిల్’ అని విమర్శించేవారు. లంచాలు తీసుకొని ఇంధన ఔట్లెట్ల లైసెన్సులను ఇప్పించారన్న ఆరోపణ రెహ్మాన్పై ఉండడమే అందుకు కారణం.
వీరంతా కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలను రచించారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలను ఆసరాగా చేసుకొని భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను నింపే ప్రయత్నం చేశారు. మరోవైపు పాకిస్థాన్ ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ.. ఇప్పటికీ అక్కడ సైన్యం అండదండలు లేనిదే మనగలగడం కష్టం. ఆ దేశ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జావెద్ బజ్వా సైతం ఇమ్రాన్కు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ సందర్భంలో ఆయన ఇమ్రాన్ ప్రభుత్వ విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం అందుకు బలం చేకూర్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?