Dominic Raab : బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ రాజీనామా
UK Deputy Prime Minister: బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు.
లండన్: బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్(Dominic Raab) తన పదవికి రాజీనామా చేశారు. తన మంత్రిత్వశాఖలోని సిబ్బంది పట్ల బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు పూర్తయింది. తాజాగా ఈ నివేదిక ప్రధాని రిషి సునాక్ చేతికి అందిన కొన్ని గంటల్లోనే రాబ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్కు రాసిన లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ దర్యాప్తును ఓ ప్రమాదకర దృష్టాంతంగా పేర్కొన్న రాబ్.. ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. దర్యాప్తులో ఏం తేలినా సరే.. మాటకు కట్టుబడి ఉండటమే ముఖ్యమని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇలా కీలక పదవులకు రాజీనామా చేసిన వారిలో డొమినిక్ రాబ్ మూడో వ్యక్తి కావడం గమనార్హం.
రాబ్తో కలిసి పనిచేసే సివిల్ సర్వెంట్స్ నుంచి ఆయన ప్రవర్తనపై ఆరోపణలు వచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీనిపై స్పందించిన ప్రధాని రిషి సునాక్.. సీనియర్ న్యాయవాది ఆడమ్ టోలీతో దర్యాప్తునకు ఆదేశించారు. మంత్రిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సూచించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేసిన టోలీ.. గురువారం ఉదయమే సునాక్కు నివేదిక పంపించినట్టు ప్రధాని అధికార ప్రతినిధి నిర్థారించారు. మరోవైపు ఇదే అంశంపై మాట్లాడిన సునాక్.. రాబ్పై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. దర్యాప్తు నివేదికలోని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఆ నివేదికను ఎప్పుడు బహిర్గతం చేస్తారనే అంశాన్ని మాత్రం ఆయన వెల్లడించేందుకు నిరాకరించారు. రాబ్పై వచ్చిన ఆరోపణలు ఈ నివేదికలో నిజమని రుజువైతే.. ఆయనపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. గతంలో యూకే విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన రాబ్ను గతేడాది అక్టోబర్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉప ప్రధానిగా రాబ్ను తన బృందంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.