Kharkiv: చిత్రహింసలకు ఛాంబర్లు.. విదేశీ విద్యార్థులపైనా దాష్టీకం!
ఉక్రెయిన్- రష్యా యుద్ధం(Ukraine Crisis) మొదట్లో మాస్కో సేనలు కీవ్ ముట్టడి యత్నాన్ని విరమించి.. వెనక్కు వెళ్లిన అనంతరం అక్కడ అనేక దారుణాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. కీవ్ సమీపంలోని ఇర్పిన్, బుచాలో అత్యంత దారుణమైన...
ఖర్కివ్లో బయటపడుతోన్న రష్యా అకృత్యాలు!
కీవ్: ఉక్రెయిన్- రష్యా యుద్ధం(Ukraine Crisis) ప్రారంభంలో పుతిన్ సేనలు కీవ్ ముట్టడి యత్నాన్ని విరమించి.. వెనక్కు వెళ్లిన అనంతరం అక్కడ అనేక దారుణాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. కీవ్ సమీపంలోని ఇర్పిన్, బుచాలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వందలాది మృతదేహాలు బయటపడ్డాయి. మేరియుపోల్లోనూ ఇదే దుస్థితి. ఇదంతా రష్యన్ సేనల అరాచకమేనంటూ ఉక్రెయిన్ ఆరోపించింది. ప్రస్తుతం ఆ దేశంలోని రెండో అతిపెద్ద ప్రాంతమైన ఖర్కీవ్(Kharkiv)లోనూ ఇదే తరహా అకృత్యాలు బయటపడుతున్నాయి. ఇటీవలే ఉక్రెయిన్ బలగాల ఎదురుదాడితో.. మాస్కో సైనికులు ఈ ప్రాంతాన్ని వీడిన విషయం తెలిసిందే.
రష్యానుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న భూభాగంలో పౌరులపై చిత్రహింసలకు పాల్పడేందుకు ఉద్దేశించిన 10ఛాంబర్లను కనుగొన్నట్లు ఉక్రెయిన్ శుక్రవారం వెల్లడించింది. ఖర్కివ్ ప్రాంతంలో ఇవి బయటపడినట్లు ఉక్రెయిన్ పోలీస్ చీఫ్ ఇగోర్ క్లైమెన్కో తెలిపారు. ఇక్కడి ఈశాన్య ప్రాంతంలోని బాలక్లియా పట్టణంలో ఈ తరహా రెండు ఛాంబర్లు కనిపించాయని చెప్పారు. అంతకుముందు.. ఇజియం శివారు అటవీ ప్రాంతంలోని ఓ గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు ఉన్నట్లు తూర్పు ఖర్కివ్ ప్రాంతంలోని సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
మృతదేహాలను చూస్తుంటే.. వారిని హింసించి చంపినట్లు కనిపిస్తోందని ఖర్కివ్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అధిపతి ఒలెక్సాండర్ ఫిల్చాకోవ్ తెలిపారు. వారి మృతదేహాలపై చిత్రహింసలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. కొందరి చెవులు కత్తిరించారని, మరికొందరి చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయని పేర్కొన్నారు. పలువురి మెడకు తాడు బిగించినట్లు తెలుస్తోందన్నారు. ఖర్కివ్ ప్రాంతంలోని కుపియాన్స్క్లో రష్యా చేతుల్లో చిక్కిన ఆరుగురు శ్రీలంక విద్యార్థుల పట్ల కూడా కర్కశంగా వ్యవహరించినట్లు చెప్పారు. ఆయా ఘటనలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని, వాటిని యుద్ధ నేరాల కింద విచారిస్తామని అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!