US visa: అమెరికా వీసా నిబంధనల్లో మరో మార్పు.. భారత టెకీలకు ప్రయోజనం!
US visa revalidation: వీసా నిబంధనల్లో బైడెన్ సర్కారు మరో మార్పు చేపట్టబోతోంది. వీసా రెన్యువల్ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా డొమెస్టిక్ వీసా రీవ్యాలిడేషన్ ప్రక్రియను పునరుద్ధరించబోతోంది.
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న భారత టెక్ వర్కర్లకు ఉపయోగపడేలా అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. హెచ్-1బీ (H-1B visa), ఎల్1 (L1 visa) వంటి వీసాల పునరుద్ధరణ ప్రక్రియకు సంబంధించి పాత విధానమైన ‘డొమెస్టిక్ వీసా రీవ్యాలిడేషన్’ను (Domestic visa revalidation) పునరుద్ధరించబోతోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించనుంది. దీనివల్ల వేలాదిమంది హెచ్-1బీ, ఎల్1 వీసాదారులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా భారత టెకీలకు (India tech workers) దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది.
ఒకప్పుడు హెచ్-1బీ వీసా కలిగిన వారు తమ వీసా పునరుద్ధరణ లేదా స్టాంపింగ్ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. 2004 వరకు ఇదే విధానం అమలయ్యేది. ఆ తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు. హెచ్-1బీ వీసా కలిగిన వారు రెన్యువల్ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అమెరికా నుంచి సొంత దేశానికి వెళ్లి మళ్లీ అమెరికాలోకి అడుగు పెట్టాలి. కొన్నిసార్లు స్టాంపింగ్కు నెలలు సైతం సమయం పడుతోంది. అదే అమెరికాను వీడి వెళ్లాల్సిన అవసరం లేకండా దేశీయంగానే వీసా పునరుద్ధరణకు అవకాశం ఇస్తే వేలాది మందికి ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతానికి అమెరికాలో రీస్టాంపింగ్ను అనుమతించడం లేదు.
ఈ నేపథ్యంలో పాత విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఏడాది చివరినాటికి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనివల్ల వీసాల పునరుద్ధరణకు సొంత దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. అయితే, ప్రారంభంలో ఎంతమందిని అనుమతించాలనే దానిపై ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదని తెలిపారు. స్వల్ప సంఖ్యలో ప్రారంభించి.. ఒకటి రెండేళ్లలో ఈ సంఖ్యను పెంచుకుంటూ వెళతామని చెప్పారు. మరోవైపు అమెరికా వీసాల కోసం భారత్లో కొండలా పెరిగిపోయిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే మరో విధానాన్ని విదేశాంగ శాఖ అమలు చేస్తోంది. ఇతర దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లోనూ వీసాల పరిశీలన ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడికి ఒక సలహా సంఘం చేసిన సిఫార్సు మేరకు చర్యలు చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. అధికార పార్టీ తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..