Amazon : ఏమీ ఆర్డర్ చేయకున్నా అమెజాన్ నుంచి వందకు పైగా పార్శిళ్లు
అమెరికాలో (America) ఓ మహిళకు వందకు పైగా అమెజాన్ (Amazon) పార్శిళ్లు వచ్చాయి. తాను ఏమీ ఆర్డర్ చేయకుండానే అవి తనకు అందాయని ఆమె వెల్లడించారు.
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని (America) వర్జీనియా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఏమీ ఆర్డర్ చేయకపోయినా ఆమెకు అమెజాన్ (Amazon) నుంచి వందకు పైగా పార్శిళ్లు అందాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? వాటిని ఏం చేయాలో తెలియక ఆ మహిళ సతమతమైంది. చివరకు వాటిని తెలిసిన వారికి, తెలియని వారికి పంచేసింది. వివరాల్లోకి వెళితే ‘లిక్సియావో జాంగ్’ పేరిట ఉన్న పెట్టెలు ప్రిన్స్ విలియం కౌంటీలోని సిండీ స్మిత్ ఇంటికి రావడం మొదలైంది. ఆ అమెజాన్ బాక్సుల్లో సుమారు వెయ్యి హెడ్ల్యాంప్స్, 800 గ్లూ గన్స్, డజన్ల కొద్దీ బైనాక్యులర్స్ వచ్చాయి. ఇలా సుమారు వందకు పైగా పార్శిళ్లు ఆమె ఇంటి తలుపుతట్టాయి.
రూ.20 లక్షలు పెట్టి.. తోడేలులా మారిపోయి!
కేవలం అమెజాన్ మాత్రమే కాదు ఫెడ్ఎక్స్ నుంచి కూడా కొన్ని పార్శిళ్లు అందాయని సిండీ పేర్కొన్నారు. ఏమీ ఆర్డర్ చేయకపోయినా వివిధ ఈ-కామర్స్ సంస్థల నుంచి తన ఇంటికి పెట్టెలు వచ్చాయని పేర్కొన్నారు. వాటి కారణంగా కొన్నిసార్లు తలుపు తెరవడం కూడా కుదర్లేదని చెప్పుకొచ్చారు. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న వస్తువులను ఏం చేయాలో పాలుపోక చివరకు వాటిని పంచేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు.
‘భారీగా వచ్చిన హెడ్ ల్యాంప్స్, గ్లూ గన్లు తీసుకొని నా కారులో బయలుదేరాను. నాకు కలిసిన ప్రతి ఒక్కరికీ అవి పంచాను. నా చుట్టుపక్కల వారందరికీ హెడ్ ల్యాంప్స్, గ్లూ గన్స్ అందాయి. డాగ్ షెల్టర్లు, వెటర్నరీ క్లినిక్లకు వాటిని ఇచ్చాను. ఓ రోజు బర్గర్ కింగ్ రెస్టారంట్కు వెళ్లాను. నేను మీకో బహుమతి తీసుకొచ్చానని చెబుతూ అక్కడ వాటిని పంచేశానని’ సిండీ వెల్లడించారు.
అధిక మొత్తంలో తనకు పార్శిళ్లు రావడం గమనించి ఆమె తొలుత ‘బ్రషింగ్ స్కామ్’లో ఇరుక్కున్నానేమోనని అనుమానించింది. నకిలీ రేటింగ్లు, రివ్యూల కోసం విక్రేతలు ఇలా పంపిస్తుంటారు. కానీ, ఆమె ‘వెండర్న్ రిటర్న్’ అనే పథకంలో బాధితురాలని కొందరు పేర్కొంటున్నారు. అమెజాన్ కేంద్రాల్లో పోగుపడిన వస్తువులను వదిలించుకోవడానికి విక్రేతలు ఇలా చేస్తుంటారు. అయితే ఇలా అధిక మొత్తంలో ఒకే కస్టమర్కు పార్శిళ్లు వెళ్లడంపై అమెజాన్ స్పందించింది. విక్రేత ఖాతా దుర్వినియోగమైనట్లు గుర్తించామంది. అందుకే ఆ ఖాతాను మూసివేస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య