Nepal: నేపాల్లో తరచూ విమాన ప్రమాదాలు ఎందుకు..?
నేపాల్(Nepal)లో విమాన ప్రమాదాలకు భౌగోళిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికీ చాలా పాత విమానాలు వినియోగిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్(Nepal)లో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. తాజాగా యతి ఎయిర్లైన్స్ విమానం పొఖారా విమానాశ్రయం వద్ద కుప్పకూలి 72 మరణించడంతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రమాదం నేపాల్(Nepal) చరిత్రలోనే మూడో అతిపెద్ద దుర్ఘటన. ఇక్కడ విమాన ప్రమాదాలకు భౌగోళిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి.
మారుమూల ప్రాంతాల్లోని రన్వేలు..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రన్వేలు నేపాల్(Nepal)లో ఉన్నాయి. ముఖ్యంగా ‘లుకుల’ వంటి ప్రమాదకరమైన రన్వేలపై విమానాలు దింపడం నిపుణులైన పైలట్లకు కూడా చాలా కష్టం. మౌంట్ ఎవరెస్ట్కు వెళ్లే వారికి ఈ ఎయిర్ పోర్టే చాలా కీలకం. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో పర్వాతాల మధ్యలో ఈ ఎయిర్ పోర్టు ఉంటుంది. ఇక్కడ రన్వే చాలా చిన్నది. దీని పొడవు కేవలం 527 మీటర్లు మాత్రమే. ప్రపంచంలోనే 14 అత్యంత కఠిన పర్వతాల్లో 8 నేపాల్(Nepal)లోనే ఉన్నాయి. వీటిల్లో ఎవరెస్ట్ కూడా ఒకటి.
వేగంగా మారిపోయే వాతావరణం..
నేపాల్(Nepal) పర్వత ప్రాంతం కావడంతో ఇక్కడ వాతావరణం చాలా వేగంగా మారిపోతుంది. దీనికి తోడు ఎయిర్పోర్టులు పర్వతాలపై సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీంతో విమానాల ఇంజిన్ల సామర్థ్యం తగ్గిపోతుంది. హఠాత్తుగా వాతావరణం మారితే మార్గం కనిపించడం కష్టమైపోతుంది. దీనికి గాలి సాంద్రతలో తేడాలు కూడా జతకలిసి ప్రయాణాన్ని కఠినంగా మార్చేస్తాయి. ఇక్కడ వాడే చాలా పాత విమానాల్లో వీటిని తట్టుకొనే టెక్నాలజీలు లేవు. బ్రిటన్ వంటి దేశాలు దౌత్య కార్యాలయాలు నేపాల్(Nepal)లో ప్రయాణించే తమ దేశస్థులకు ముందస్తు సూచనలు కూడా జారీ చేస్తుంటాయి. ఇక్కడ వాతవరణం దెబ్బకు చిన్నవిమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతుంటాయి.
కాలం చెల్లిన టెక్నాలజీ..
ప్రపంచంలోని పేద దేశాల్లో నేపాల్(Nepal) ఒకటి. ఇక్కడ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు దేశీయ ప్రయాణాలకు పాత విమానాలనే వాడతాయి. అనుకోని సమస్యలు ఎదురైతే తట్టుకొనేలా అత్యాధునిక వాతావరణ రాడార్లు, జీపీఎస్ టెక్నాలజీ వంటివి వీటిల్లో ఉండవు. అక్కడ ఇప్పటికీ దశాబ్దాల నాటి విమానాలు వినియోగిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నేపాల్తో కలిసి పనిచేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?