శ్రీకాకుళం జిల్లాలో 40 కోతుల మృతి.. విష ప్రయోగంపై స్థానికుల అనుమానం
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలాగం గ్రామ సమీప రహదారిపై 40 కోతుల మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. రోడ్డు పక్కన తోటలో అపస్మారక స్థితిలో మరికొన్ని కోతులు కనిపించాయి. వాటికి స్థానికులు బిస్కెట్లు, నీళ్లు అందించారు. కోతులపై విష ప్రయోగం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోతులు మృతదేహాలను పరీక్షించేందుకు అటవీశాఖ అధికారులు బయలుదేరారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కారణాలు తెలుపుతామని వెల్లడించారు.
Updated : 25 Oct 2022 17:25 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!