Kishan Reddy: హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోంది: కిషన్ రెడ్డి
హోంగార్డులు రోజుకు 16 గంటలు పనిచేస్తున్నా, వారిని ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy) ఆరోపించారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ను డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు. ప్రభుత్వం ఎటువంటి రాజకీయాలకు పాల్పడకుండా అతనికి న్యాయం చేయాలని తెలిపారు. పోలీసు వ్యవస్థ సైతం వారిని అవమానిస్తోందని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Published : 07 Sep 2023 18:45 IST
Tags :