కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొన్న కారు.. ఒకరు మృతి
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేబుల్ బ్రిడ్జిపై రాత్రి ఒంటి గంట సమయంలో సరదాగా ఫోటోలు దిగుతున్న క్రమంలో.. ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టింది. ఘటనలో కారు ఢీకొని అనిల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి అజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published : 06 Apr 2024 17:07 IST
Tags :