AP News: జనం లేక వెలవెలబోయిన సీఎం జగన్‌ బస్సు యాత్ర

ఉమ్మడి తూర్పుగోదావరి  జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్ జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతం ఇచ్చారు.

Published : 19 Apr 2024 12:29 IST

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్ జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతం ఇచ్చారు. అడుగడుగునా ఆర్భాటంగా సాగుతుందని వైకాపా నేతలు భావించిన బస్సు యాత్ర.. జనం లేక వెలవెలబోయింది. రూ.200 పెట్రోలు కూపన్లు ఇచ్చి బలవంతంగా జనాన్ని తరలించినా అంతంత మాత్రంగానే జనం రావడం అధినేతకు అసహనం తెప్పించింది. మరోవైపు దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడిక్కడ విద్యుత్తు తీగలు, ఇంటర్నెట్‌, సిటీ కేబుళ్ల తొలగింపుతో జనం అవస్థలు పడ్డారు.

Tags :

మరిన్ని