DL RavindraReddy: జగన్‌ గెలవడం కష్టమే.. అవినాష్‌రెడ్డి ఓటమి ఖాయం!: డీఎల్ రవీంద్రారెడ్డి

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి తేవడంతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేటలోని తన స్వగృహంలో ఆయన మాట్లాడారు.

Published : 08 May 2024 17:14 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి తేవడంతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేటలోని ఆయన స్వగృహంలో ఆయన మాట్లాడారు. అతి కష్టం మీద జగన్‌ మోహన్‌రెడ్డి గెలిచినా.. అవినాష్‌రెడ్డి ఓటమి చెందడం ఖాయమన్నారు. ఎంపీ అవినాష్‌ దిగజారి తనను బెదిరించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారనే కారణంతో కేసు పెట్టించారని మండిపడ్డారు. పథకం ప్రకారమే వివేకానందరెడ్డిని అవినాష్‌రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. ప్రజల భూములు సురక్షితంగా ఉండాలంటే.. కూటమిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు సూచించారు.

Tags :

మరిన్ని