Sircilla: దంచికొట్టిన వడగళ్ల వాన.. అర్ధాంతరంగా భారాస ప్లీనరీ ముగింపు
సిరిసిల్లలో భారీ వర్షం పడటంతో.. నియోజకవర్గ స్థాయి భారాస (BRS) ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ సభ అర్ధాంతరంగా ముగిసింది. సమావేశం చివరి దశలో ఈదురు గాలులు, వడగళ్ల వాన కారణంగా కొన్ని టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సభా ప్రాంగణం కిందికి వర్షం నీరు రావడంతో మంత్రి కేటీఆర్ (KTR) ప్లీనరీలోని తీర్మాన అంశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ, సమావేశం ముగిసిందని ప్రకటించారు. అకాల వర్షంతో భారాస నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Published : 25 Apr 2023 22:01 IST
Tags :