Kishan reddy: కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే నిజాం పాలన తెస్తారు: కిషన్ రెడ్డి
రాబోయే ఎన్నికల్లో చిన్నపొరపాటు చేసినా, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) పేర్కొన్నారు. ప్రశ్నించే వారు లేకుండా సంఘాలన్నింటిని కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ 24 గంటల పాటు చేపట్టిన నిరాహార దీక్షను విరమింప జేశారు. అనంతరం, కేసీఆర్ ప్రభుత్వ తీరుపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Updated : 14 Sep 2023 16:56 IST
Tags :