మాజీ ఎమ్మెల్యే షకీల్‌ నిరాధార వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటాం: హైదరాబాద్‌ సీపీ

    పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ విషయంలో అతడి తండ్రి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తర్వాత పోలీసు అధికారులతో కలిసి కేసును తప్పుదోవ పట్టించిన రాహిల్.. దుబాయ్ పారిపోయాడని, అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా 15 మందిని అరెస్టు చేశామని తెలిపారు. నిరాధార, ఊహాజనిత వ్యాఖ్యలు చేసిన షకీల్‌పై సైతం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు స్పష్టం చేశారు.

Published : 18 Apr 2024 10:14 IST

    పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ విషయంలో అతడి తండ్రి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తర్వాత పోలీసు అధికారులతో కలిసి కేసును తప్పుదోవ పట్టించిన రాహిల్.. దుబాయ్ పారిపోయాడని, అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా 15 మందిని అరెస్టు చేశామని తెలిపారు. నిరాధార, ఊహాజనిత వ్యాఖ్యలు చేసిన షకీల్‌పై సైతం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని