Khushbu: సీఎం రమేశ్‌కు మద్దతుగా అనకాపల్లిలో ఖుష్బూ ఎన్నికల ప్రచారం

అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ తరఫున భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 30 Apr 2024 13:44 IST

పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భాజపా నాయకురాలు ఖుష్బూ ఓటర్లను కోరారు. అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రమేశ్‌ ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారన్నారు. ఈ ఎన్నికల ద్వారా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో పని చేసే అవకాశం రావడం సంతోషకరమన్నారు.

Tags :

మరిన్ని