YS Bharathi: ఎన్నికల ప్రచారంలో.. సీఎం జగన్‌ సతీమణి భారతికి చేదు అనుభవం

సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన సతీమణి భారతికి చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో సొంతపార్టీ నేతలే ఆమెను నిలదీశారు.

Published : 30 Apr 2024 10:00 IST

సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన సతీమణి భారతికి చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో సొంతపార్టీ నేతలే ఆమెను నిలదీశారు. తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాసుపుస్తకాలపై సీఎం జగన్ ఫొటో ఎందుకు ముద్రిస్తున్నారని ప్రశ్నించడంతో ఆమె అవాక్కయ్యారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కుమ్మరాంపల్లె మాజీ సర్పంచి భర్త, వైకాపా నాయకుడు భాస్కరరెడ్డి ఆమెకు విజ్ఞప్తి చేస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు. 

Tags :

మరిన్ని