హెలికాప్టర్ వల్లే గేదె మృతి చెందిందంటూ పైలట్పై పోలీసులకు వృద్ధుడి ఫిర్యాదు!
రాజస్థాన్లోని అల్వార్లో వింత ఘటన జరిగింది. హెలికాప్టర్ శబ్దం వల్లే తన గేదె చనిపోయిందని ఓ వృద్ధుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అల్వార్ జిల్లా బహ్రోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్పై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించాలని అతని అనుచరులు నిర్ణయించారు. ఈ క్రమంలో హెలికాఫ్టర్ కోహ్రానా గ్రామం మీదుగా పలుమార్లు తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టింది. దీంతో పెద్ద శబ్దం వచ్చింది. ఈ శబ్దం కారణంగా తన గేదె మృతిచెందిందని ఆ గ్రామానికి చెందిన బల్వీర్ అనే వృద్ధుడు ఆరోపించాడు. అనంతరం హెలికాప్టర్ పైలట్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Updated : 14 Nov 2022 13:31 IST
Tags :