Suneetha: పదవుల కోసం వివేకా హత్య.. వైఎస్సార్ ఉంటే సహించేవారా?: సునీత
వైఎస్ షర్మిలను ఎంపీ చేయాలని తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి ఎంతగానో తాపత్రయపడ్డారని ఆయన కుమార్తె సునీత (Suneetha) అన్నారు. రాజకీయాల కోసమే తన తండ్రిని క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేయించిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం వరికుంట్లలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన బస్సు యాత్రలో సునీత మాట్లాడుతూ.. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే దీన్ని సహించేవారా? పదవుల కోసం తమ్ముణ్ని చంపితే చూసి తట్టుకొనేవారా? అని ప్రశ్నించారు.
Published : 05 Apr 2024 20:18 IST
Tags :