Tadipatri: తెదేపా,వైకాపా మధ్య ఘర్షణ.. పెన్నానది సమీపంలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెన్నానది సమీపంలో తెలుగుదేశం, వైకాపా నాయకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెన్నానది ప్రాంతంలో తాగునీటి పైపులైను మరమ్మతులను పరిశీలించడానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడున్న ఎమ్మెల్యే అనుచరులు.. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి అనుచరులు సైతం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతల పోటాపోటీ నినాదాలతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. 

Updated : 02 Mar 2024 16:20 IST

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెన్నానది సమీపంలో తెలుగుదేశం, వైకాపా నాయకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెన్నానది ప్రాంతంలో తాగునీటి పైపులైను మరమ్మతులను పరిశీలించడానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడున్న ఎమ్మెల్యే అనుచరులు.. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి అనుచరులు సైతం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతల పోటాపోటీ నినాదాలతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. 

Tags :

మరిన్ని