Andhra news: మహిళ ఖాతా నుంచి రూ.70 వేలు కాజేసిన వాలంటీర్!
నంద్యాల జిల్లా గడివేముల మండలం తిరుపాడులో ఓ మహిళ ఖాతా నుంచి వాలంటీర్ రూ.70 వేలు కాజేసిన ఘటన వెలుగు చూసింది. మహిళ చెప్పిన వివరాల మేరకు.. రైతు భరోసా డబ్బులు రాలేదని అడిగిన నాగవేణి అనే మహిళతో వాలంటీర్ బాలమద్దులు నాలుగు సార్లు వేలి ముద్రలు వేయించుకున్నాడు. ఆధార్ కార్డు అవసరం ఉందని తీసుకువెళ్లాడు. వాటి ఆధారంగా మహిళ ఖాతా నుంచి రూ. 70 వేలు నగదు విత్ డ్రా చేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వాలంటీర్ పరారీలో ఉన్నాడని తెలిపారు.
Published : 01 Jul 2022 16:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్