బ్రేకింగ్

breaking
20 Apr 2024 | 12:06 IST

అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు: నారా భువనేశ్వరి

కుప్పం: ప్రార్థనా స్థలాలతో పాటు శ్మశానాలను వైకాపా వదల్లేదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. కుప్పంలో ముస్లిం మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. ‘‘80 శాతం వక్ఫ్‌ భూములను వైకాపా ఆక్రమించుకుంది. భూములు కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకుంది. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలేవీ జగన్‌ నెరవేర్చలేదు. సచివాలయంతో పాటు అన్నీ తాకట్టు పెట్టేసి డబ్బు లాగుతున్నారు. తెదేపా కార్యకర్తలను బెదిరించారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారు’’ అని నారా భువనేశ్వరి అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు