బ్రేకింగ్

breaking
20 Apr 2024 | 14:52 IST

కాంగ్రెస్‌పై చెయ్యి వేస్తే మాడి మసైపోతారు: రేవంత్‌

మెదక్‌: ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే వరిపంటకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీఎం మాట్లాడారు. ప్రజల కష్టాలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని అన్నారు. ‘‘ కాంగ్రెస్‌పై చెయ్యి వేస్తే మాడి మసైపోతారు. పేదలకు ఎప్పుడూ అండగా నిలబడేది మూడు రంగుల జెండానే, కాంగ్రెస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలి’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని

తాజా వార్తలు