బ్రేకింగ్

breaking
06 May 2024 | 16:19 IST

వైకాపా పాలనలో అభివృద్ధి సున్నా: మోదీ

రాజమహేంద్రవరం: వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనం బాట పట్టించిందని ప్రధాని మోదీ అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ ఈ ఎన్నికల్లో వైకాపాను ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ఏపీ నెంబర్‌వన్‌గా ఉండేది. జగన్‌ ఐదేళ్ల ప్రభుత్వంలో పాలన పట్టాలు తప్పింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. వైకాపా పాలనలో అభివృద్ధి సున్నా. అవినీతి వందశాతం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అవసరం. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు