చోరీకొస్తే సీన్ రివర్స్.. విసుగొచ్చి వెళ్లిపోయిన దొంగ
పట్టపగలే దొంగతనం చేద్దామని ప్రయత్నించిన ఓ దొంగకు ప్లాన్ అంతా బెడిసి కొట్టింది. చేతిలో ఆయుధం ఉందని బెదిరించి డబ్బులు తీసుకుందామని అనుకున్నాడు. కానీ అక్కడున్నవారు భయపడకపోగా, తాపీగా సినిమా చూసినట్టు చూశారు. ఇక దొంగ ఏం చేయలేక నిరాశగా వెనుదిరిగాడు.
వాషింగ్టన్: పట్టపగలే దొంగతనం చేద్దామని ప్రయత్నించిన ఓ దొంగకు ప్లాన్ అంతా బెడిసి కొట్టింది. చేతిలో ఆయుధం ఉందని బెదిరించి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నించాడో దొంగ. కానీ అక్కడున్నవారు భయపడకపోగా, తాపీగా సినిమా చూసినట్టు చూశారు. దీంతో విసిగిపోయి ఆ దొంగ నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
ఈ ఘటన అమెరికాలోని అట్లాంటాలో నెయిల్ ఫస్ట్ సెలూన్లో గత సోమవారం చోటుచేసుకుంది. సెలూన్ కస్టమర్లతో బిజీగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి లోపలికి చొరబడ్డాడు. అక్కడున్న సిబ్బందిని, కస్టమర్లను డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని అందులో తుపాకీ ఉందని డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. కానీ అతడి బెదిరింపులను ఎవరూ పట్టించుకోలేదు. అతడు ఓ వైపు అరుస్తుంటే కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి తాపీగా ఫోన్ మాట్లాడాడు. ఒక మహిళ లేచి మాత్రం కాస్త కంగారుపడి బయటకు వెళ్లిపోయినా.. మిగతా వారంతా తమకేం పట్టన్నట్లు అలాగే కూర్చున్నారు. దొంగ ఎన్ని సార్లు బెదిరించినా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో అతడు విసిగిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ తతంగమంతా అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయ్యింది. అట్లాంటా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. ఈ చోరీ తీరును చూసి నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్