దిల్లీ మెట్రోలో యువతి డ్యాన్స్‌..వీడియో వైరల్‌!

దిల్లీ మెట్రోలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంది. తాజాగా ఓ యువతి మెట్రోలో డ్యాన్స్‌ చేసిన వీడియోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated : 10 Jul 2023 20:13 IST

దిల్లీ: దిల్లీ మెట్రోలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంది.  అది వివాదానికి దారి తీస్తూనే ఉంది.  డీఆర్‌ఎంసీ(DRMC) అధికారులు పదేపదే హెచ్చరించినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. తాజాగా మెట్రోలో తీసిన మరో వీడియో నెట్టింట బాగా వైరల్‌ అయ్యింది. సీమ కనోజియా అనే యువతి దిల్లీ మెట్రో ప్లాట్‌ఫారమ్‌పై లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్ పాట "అందేఖి"కి డ్యాన్స్ చేసింది. అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 
పోస్టు చేసిన అనతి కాలంలోనే 75 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి.  దీనిపై పలువురు నుంచి తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇలాంటి వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒకరు వ్యాఖ్యానించగా, ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మెట్రో సేవలను కించపరుస్తున్నారని ఒకరు కామెంట్‌ చేశారు. దిల్లీ మెట్రోకు చెక్‌ అప్‌ అవసరం. ఇది కొత్త లొకేషన్‌లా ఉంది అని మరొకరు కామెంట్‌ రాశారు. 
ఇలా డ్యాన్స్ వీడియోలను తీయడం, ఇతర ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగించడంపై దిల్లీ మెట్రో అధికారులు ఇదివరకే  అనేక హెచ్చరికలు జారీ చేశారు. కానీ  కొందరు వ్యక్తులు ఈ హెచ్చరికలను విస్మరించి, ఎక్కువ క్లిక్స్‌ రావడానికి రైలు లోపల వీడియోలను తీస్తున్నారు. 

 




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని