Viral Video: మృత్యుంజయుడు! రైలు వెళ్లినా.. ఎలా బతికిపోయాడో చూడండి

ఓ ప్రయాణికుడు ఆశ్చర్యకర రీతిలో రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడటంతో........

Updated : 06 Sep 2022 18:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఓ ప్రయాణికుడు ఆశ్చర్యకర రీతిలో రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడటంతో అక్కడున్నవారంతా అతడు నిజంగా మృత్యుంజయుడని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భర్తానా రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారింది.

ఓ బ్యాగుతో భర్తానా రైల్వేస్టేషన్‌కు వచ్చిన సదరు ప్రయాణికుడు.. వెళుతున్న సూపర్‌ఫాస్ట్‌ ఇంటర్‌సిటీ రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ క్రమంలో అతడు పట్టుతప్పిపోయి ప్రమాదవశాత్తూ ప్లాట్‌ఫామ్‌, రైలు మధ్యలో పడిపోయాడు. దీంతో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మిగతా ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పట్టాల కింద నలిగిపోయి అతడు చనిపోయి ఉంటాడా? లేక గాయాలతో బతికేఉంటాడా? లాంటి అనుమానాలతో వారంతా ఉత్కంఠగా వేచిచూడసాగారు.

కానీ ఆశ్చర్యకర రీతిలో అతడికి చిన్న గాయం కూడా కాలేదు. ప్లాట్‌ఫామ్‌, రైలు మధ్య పడిపోయిన అతడు.. ఆ రైలు వెళ్లేదాకా ఎటూ కదల్లేదు. అక్కడే నక్కి ఉండి, రైలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత  లేవడంతో.. మిగతా వారంతా హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. అతడు.. అందరికీ నమస్కరించి, తన బ్యాగు సర్దుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తాన్నీ కొందరు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. కాగా ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని