అలాంటి అవమానం మరెవరికీ జరగకూడదు

ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదనీ.. ఏపీ శాసనసభలో తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదని

Updated : 27 Nov 2021 13:00 IST

నారా భువనేశ్వరి ఆవేదన

తనపై వ్యాఖ్యల్ని ఖండించిన వారందరికీ ధన్యవాదాలు

ఈనాడు, అమరావతి: ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదనీ.. ఏపీ శాసనసభలో తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదని ఆశిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానంపై నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ హోదాలో ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ వాటిని పాటిస్తున్నాం. శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురుకి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలవడం జీవితంలో మర్చిపోలేను’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలనీ, కష్టాల్లో, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని ఆకాంక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని