స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది.
ఆరు నెలల ముందే.. అధిక ధరకు కొనేలా జగన్ ప్రభుత్వం ఒప్పందాలు
అప్పటి ధరలో సగానికే ఇప్పుడు మార్కెట్లో అందుబాటు
ఈనాడు, అమరావతి: ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. ఎస్టీవోఏల ద్వారా 3,640 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ కొనుగోలుకు వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో గత ఏడాది అక్టోబరులో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటే తక్కువ ధరకే విద్యుత్ రావాలి. కానీ, జగన్ ప్రభుత్వ నిర్వాకం చూడండి. రియల్ టైం మార్కెట్లో ఏరోజుకారోజు కొనుగోలు చేసే విద్యుత్ ధర కంటే దాదాపు రెట్టింపు ధరకు అంటే ఒక యూనిట్కు సగటున రూ.8.69 చొప్పున కొనేందుకు విద్యుత్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో కోతలు పెడితే జనం ‘ఓటు వాతలు’ పెడతారనే భయంతో ముందస్తుగా విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ‘విద్యుత్ షాక్’ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజలపై అధిక భారం పడుతుందని తెలిసీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. గత రెండేళ్లూ జగన్ ప్రభుత్వం వేసవిలో విద్యుత్ కోతలతో ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపింది. ఎన్నికల ఏడాదిలోనూ గతంలో మాదిరే విద్యుత్ కోతలు పెడితే.. ఆ ప్రభావం ఓట్లపై పడే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసి ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని కొంతైనా తగ్గించాలని భావించి అధిక ధరకు విద్యుత్తును కొనేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఆ భారాన్ని ట్రూఅప్.. ఇంధన సర్దుబాటు ఛార్జీల (ఎఫ్పీపీసీఏ) పేర్లతో ప్రజలపైనే మోపనుంది. ఇప్పుడు కొత్త ఒప్పందాల ద్వారా పడ్డ భారం రూ.1274 కోట్లను ఎన్నికల తర్వాత ప్రజల నుంచి పిండుకునేలా ప్రతిపాదనలను సిద్ధంగా ఉంచింది.
ముందస్తు అంచనాల్లోనూ తడబాటు!
టైం బ్లాక్ వారీగా (15 నిమిషాలు టైం బ్లాక్) విద్యుత్ డిమాండ్ను అంచనా వేసే సాంకేతికతను వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ శనివారం 250.79 ఎంయూలుగా ఉంది. గత వారం రోజులుగా విద్యుత్ డిమాండ్ కొంచెం అటూఇటుగా ఉంటోంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, కేంద్ర విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏల ద్వారా అందుబాటులో ఉన్న విద్యుత్ పోగా.. ఎస్టీవోఏలతో సుమారు 35 ఎంయూల విద్యుత్ సర్దుబాటు అవుతోంది. కొన్ని టైం బ్లాక్లలో డిమాండ్ సర్దుబాటు కోసం డిస్కంలు డ్యామ్, ఆర్టీఎం మార్కెట్లో విద్యుత్తును కొంటున్నాయి. విచిత్రం ఏంటంటే.. ఆరు నెలల ముందుగా కుదుర్చుకున్న ఎస్టీవోఏ ధర కంటే.. సగానికి సగం తక్కువకే ఎక్స్ఛేంజీలలో విద్యుత్తు దొరుకుతోంది. ఎస్టీవోఏలతో యూనిట్కు రూ.8.69 చొప్పున డిస్కంలు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్ఛేంజీల్లో యూనిట్ విద్యుత్ సగటున రూ.4.50కే లభిస్తోంది. ట్రాన్స్మిషన్ ఛార్జీలు, సరఫరా నష్టాల కింద యూనిట్కు 69 పైసల చొప్పున మినహాయించినా ప్రస్తుతం యూనిట్కు కనీసం రూ.3.5 అదనంగా చెల్లించాల్సి రావడం గమనార్హం. ఈ లెక్కన రెట్టింపు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
ఎంతో కొంత.. అమ్ముకుందాం
ఎస్టీవోఏలతో కొనుగోలు చేసిన విద్యుత్తు వల్ల కొన్ని సందర్భాల్లో మిగులు ఉంటోంది. ఆ కరెంటును వినియోగించకపోయినా బిల్లులు చెల్లించక తప్పదు. ఈ కారణంగా విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో కొంత విద్యుత్తును డిస్కంలు విక్రయిస్తున్నాయి. ఎక్స్ఛేంజీల్లో డిస్కంలు కొనుగోలు చేసే ధర కంటే ఎక్కువ మొత్తానికి విక్రయించడానికి అవకాశమే లేదు. అదే రోజు డిస్కంలు కొన్న ధరతోనే విక్రయించక తప్పదు. అయితే విద్యుత్తును కొన్న ధర కంటే తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఎస్టీవోఏలతో సుమారు 800 మెగావాట్ల విద్యుత్తును కొంటే.. సుమారు 200 మెగావాట్ల మేర మిగులు ఉంటోందని విశ్వసనీయ సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. -
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. -
గులకరాయి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. -
జూ.ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
జూనియర్ ఎన్టీఆర్కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. -
పోలీసులు అమాయకులను బలిచేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ పిల్లలకు పలక ఇచ్చారా?
-
విధి వంచితులకు చేయూత
అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు. -
నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
విద్యార్థులూ, తాజా గ్రాడ్యుయేట్లూ తమ అభిరుచిమేరకు కెరియర్ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచ విలువైన అనుభవాన్ని గడించడానికి ఇంటర్న్షిప్లు తోడ్పడతాయి. -
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. -
నాలుగు సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలు
రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
ఐపీఎల్ టాప్-2 జట్లలో వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేరా..!
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM