అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి

2018 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) జవాబు పత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Updated : 30 Apr 2024 06:37 IST

పిటిషనర్లకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం
గ్రూప్‌ 1 అప్పీళ్లపై విచారణ మే 8కి వాయిదా

ఈనాడు, అమరావతి: 2018 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) జవాబు పత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను తొలగించొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మే 8 వరకు పొడిగించింది. మరోవైపు తాము ఈ అప్పీళ్లలో వాదనలు వినిపించేందుకు అనుమతించాలంటూ తాజాగా కొంతమంది అభ్యర్థులు వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది. విచారణను మే 8కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని