గోపాలక విద్య
శ్రీకృష్ణుడు మురళీధరుడు. ఆయన నాద వినోదుడు. శ్రావ్యమైన మురళీ నాదంతో జీవరాశులన్నింటినీ మైమరపించి మురిపించాడు. ఆ మురళి వల్లే ఆయన పురాణపురుషుడైనాడని రాగ గోవిందంలో మీరాబాయి కీర్తించింది.
శ్రీకృష్ణుడు మురళీధరుడు. ఆయన నాద వినోదుడు. శ్రావ్యమైన మురళీ నాదంతో జీవరాశులన్నింటినీ మైమరపించి మురిపించాడు. ఆ మురళి వల్లే ఆయన పురాణపురుషుడైనాడని రాగ గోవిందంలో మీరాబాయి కీర్తించింది. వెదురుతో చేసిన పిల్లనగ్రోవిది ఎంత అదృష్టమో కదా... ఆయన అధరాలను తాకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆస్వాదించి రాగాలను సృజిస్తోందని మీరాబాయి గానం చేసింది. అథర్వణ వేదానికి సంబంధించిన కృష్ణోపనిషత్తులో మురళిని గురించిన వివరాలు ఉన్నాయి. ఇది అత్యంత ప్రాచీనమైన వాద్యమని, దీని నుంచి వెలువడే రాగాలను పంచ భూతాలు తమలో లీనం చేసుకొంటాయని కృష్ణోపనిషత్తు చెబుతోంది. ఆదిమజాతి మానవులు సాధు జీవాలను మచ్చిక చేసుకోవడానికి తమ నోటితో రాగయుక్తమైన ధ్వనులు సృజించి వాటికి ఆనందం చేకూర్చేవారట. ఆ తరవాత వెదురు బొంగు నుంచి పిల్లనగ్రోవిని తయారుచేసి రాగ ధ్వనులతో వాటి చెవులకు ఇంపు చేకూర్చేవారని నీలకంఠ శాస్త్రి రాసిన పుస్తకం వేదకాలం నాటి భారతీయ సంస్కృతిని చాటుతోంది.
శ్రీకృష్ణుడు ఆలమందల పోషణలో భాగంగా వేణువును ఊదుతూ వాటిని రంజింప జేసేవాడు. అవి మోరలెత్తి ఆ వేణుగానాన్ని వింటూ ఆహారాన్ని నెమరు వేసుకొంటూ ఆనందాన్ని వ్యక్తం చేసేవి. అథర్వణ వేద విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆవులు సైతం తొమ్మిది రకాల భావావేశపూరిత అనుభూతులకు లోనవుతాయని ఒకటో శతాబ్దానికి చెందిన పలకాప్యుడు, ఆ తరవాతి తరం నాటి శాలిహోత్రుడు పేర్కొన్నారు. నింపాదిగా కూర్చుని ఆహారాన్ని నెమరు వేసుకుంటూ నిమీలిత నేత్రాలతో ఆవు ఉంటే సాంత్వనంతో నిమ్మళంగా ఉన్నదని గుర్తు. ఆవు చెవులు నిటారుగా ఉంటూ రెప్పలార్చకుండా ఉంటే వ్యాకులతతో కూడిన ఒత్తిడిలో ఉన్నట్లు భావిస్తారు. కళ్లు మాటిమాటికీ మూసుకొంటూ కళ్లలో తెలుపు భాగం ఎక్కువగా కనిపిస్తే అది భయంతో శరీరంలో ఎక్కడో నొప్పిని అనుభవిస్తున్నట్లుగా సంకేతం. కళ్లు మూసుకుని నిద్రిస్తున్నట్లుగా ఉంటే ఆవు సేదతీరుతున్నట్లు గోపాలకులు గమనిస్తారు. నడకలో విశ్వాసం, ధైర్యం కనపడితే పశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకొంటారు. అవి తలను నేలవైపు దించి అడుగులు వేస్తుంటే సౌఖ్యంగా లేనట్లు భావిస్తారు. అలా వాటి అవస్థలను గుర్తెరిగి మురళిని శ్రీకృష్ణుడు ఊదేవాడట. ఆలమందలు అలా ఊరట చెందేవి.
సంగీతం తీయని మాటకన్న మధురమైందని సామవేదం చెబుతోంది. గోపాలుడికి పశుపోషణతోపాటు వాటి నైజం బాగా తెలుసునని శ్రీకృష్ణోపనిషత్తు వివరిస్తోంది. ఆహారంతో పాటు శ్రావ్యమైన సంగీతాన్ని ఆవులు ఆస్వాదిస్తాయని నందుడు శ్రీకృష్ణుడికి చెప్పాడంటారు. ఆలమందల అలవాట్లను క్షుణ్నంగా పరిశీలించి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వేణునాదాన్నే ఎన్నుకున్నాడు మాధవుడు. ఉదయమే ఆవుల పొదుగులు పాలతో నిండి ఉన్నప్పుడు భైరవి రాగాన్ని మధురంగా పిల్లన గ్రోవిపై ఊదేవాడు. ఈ రాగాన్ని వింటూ ఆవులు కడివెడు పాలు ఇచ్చేవట. భైరవి రాగాన్ని వినగానే గోప బాలకులందరూ చద్ది అన్నాలు కట్టుకొని పశువులను వెంటపెట్టుకొని అడవి వైపు వెళ్ళేవారట. పచ్చిక బయళ్లలో మేసి మధ్యాహ్నం ఆవులు తీరికగా కూర్చున్నవేళ మధ్యమావతి పలికించాలంటారు. రాత్రి పశువులు నిద్రించేవేళ హిందోళం చాలా మంచి రాగమని చెబుతారు. శ్రీకృష్ణుడికి, ఆయన వెంట తిరిగే గోప బాలురకు తెలిసిన ఈ విద్యను గోపాలక విద్య అంటారు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఈ గోపాలక విద్యను పాండవులలో అందరికన్నా చిన్నవాడైన సహదేవుడికి అందించాడని భారతం చెబుతోంది.
- అప్పరుసు రమాకాంతరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం