దివ్య చరణాలే శరణ్యం
తిరుమల ఆనంద నిలయంలో బ్రహ్మస్థానమనే దివ్య ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వరస్వామి అర్చా రూపంలో స్వయం వ్యక్తమూర్తిగా నిలిచి భక్తులను అనుగ్రహిస్తారు. తన దివ్య పాదాలే పరమార్థమని చూపించే వజ్ర కవచ వరదహస్తంతో శోభిల్లే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించే భక్తుల ఆనందం వర్ణనాతీతం.
తిరుమల ఆనంద నిలయంలో బ్రహ్మస్థానమనే దివ్య ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వరస్వామి అర్చా రూపంలో స్వయం వ్యక్తమూర్తిగా నిలిచి భక్తులను అనుగ్రహిస్తారు. తన దివ్య పాదాలే పరమార్థమని చూపించే వజ్ర కవచ వరదహస్తంతో శోభిల్లే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించే భక్తుల ఆనందం వర్ణనాతీతం. హరిపాద సేవతో పాపాలు నశిస్తాయి. గోవిందనామస్మరణ మనోధైర్యాన్నిస్తుంది. శరణాగతవత్సలుడి ముందు శిరస్సువంచిన భక్తుడి మనసు పావనమై ప్రశాంత నిలయమవుతుంది.
దానవులు, దైత్యులు, నరులు, గంధర్వులు ఎవరైనా ఆ లక్ష్మీపతి పాదపద్మాలను సేవిస్తేనే పుణ్యాత్ములవుతారని, తన మనసు దివ్యమైన విష్ణుపాదాలను ధ్యానించడంలోనే పరవశించి ఆనందిస్తుందని చదువులలో మర్మమెల్ల గ్రహించిన ప్రహ్లాదుడు భక్తితత్వాన్ని వివరించాడు. ధర్మార్థకామమోక్షాలనే నాలుగు విధాలైన పురుషార్థాలను పొందాలనుకునే వారికి శ్రీహరి పాదపద్మాలను సేవించడం తప్ప మరో మార్గంలేదు. సాటి లేని శాంతస్వభావుడు సర్వలోక రక్షకుడైన శ్రీహరి భక్తుల హృదయాల్లో ప్రకాశించే పాదపద్మాలు కలవాడని నారదుడు ధ్రువుడికి ఉపదేశించాడు.
ఆది మధ్యాంతాలు లేని విష్ణుపాద దర్శనం తమకు శుభాన్ని కలిగిస్తుందని బ్రహ్మాది దేవతలు ఒక సందర్భంలో వెల్లడించారు. అపారమైన భక్తితో శ్రీహరి పాద పద్మాలను సేవించే వరం ప్రసాదించమని ఇంద్రుడు ప్రార్థించాడు. శ్రీకృష్ణభగవానుడు ప్రాణులందరికీ నేత కనుక దేవతలందరూ అతడి దివ్య చరణాలపై శిరసు వంచుతారు. శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన వారిని ఆదరిస్తాడు. శరణాగతులను రక్షిస్తాడు. కనుక వాసుదేవుడికి ప్రణమిల్లాలని పరమేశ్వరుడు హిమాలయ శిఖరం మీద మునీంద్రులకు తెలియజేసినట్లు భారతం చెబుతోంది. అంతటి మహిమాన్విత పాదపద్మాలను మనసులో ప్రతిష్ఠించుకుని ధ్యానించే అవకాశం లభించిన మానవుడు అత్యంత భాగ్యశీలి.
బాలకృష్ణుడి ప్రచండ తాండవానికి కాళీయుడి తల చితికిపోయింది. కాళియుడు శ్రీకృష్ణుణ్ని శరణువేడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. శరణు కోరినవారిని రక్షించే శ్రీవారి పాదాలే దుష్టులను శిక్షిస్తాయి. ఏడు దీపాలతో కూడిన భూమండలానికి రాజైన అంబరీషుడి మనసు శ్రీహరి పాదాల మీద, మాటలు హరిగుణ సంకీర్తనలపై చూపులు గోవిందుడి రూపాన్ని తనివితీరా చూడటంపట్ల లగ్నమై ఉండేవంటారు. అంబరీషుడి భక్తితత్పరత అందరికీ అనుసరణీయం.
భక్తుల ప్రేమబంధానికి చిక్కిన తాను ప్రేమతో వారివెంటే ఉంటానని, తనను నమ్ముకున్న ఎవరినైనా తాను వదిలిపెట్టనని, తన భక్తులకు తానే దిక్కని శ్రీ మహావిష్ణువు దుర్వాసమహర్షికి చెప్పినట్లు భాగవతం వెల్లడిస్తోంది. విష్ణుపాదమందిరం గయలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడ విష్ణుపాద ముద్రగల రాతిబండను భక్తులు పూజిస్తారు. ఆ క్షేత్రంలో చేసే పితృకార్యాలు ఏడు తరాలను ఉద్ధరిస్తాయని భక్తుల విశ్వాసం. బదరీనాథ్ దగ్గర చరణపాదుక అనే ప్రదేశంలో ఒక రాతిపై శ్రీమహావిష్ణువు కాలి అడుగుల ముద్రను దర్శించవచ్చు. భక్తికి మించిన శక్తి లేదన్నది నిర్వివాదాంశం. ఎన్నోజన్మల పుణ్యఫలంగా లభించిన మానవజన్మ మహిమాన్వితమైన శ్రీహరి పాదపద్మాలను ఆరాధించడం ద్వారా సార్థకం కాగలదని గ్రహించాలి.
ఇంద్రగంటి నరసింహమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం