AP News: వేగంగా పరిహారం ఇచ్చినా విమర్శిస్తున్నారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేసి బాధితులకు వేగంగా పరిహారం అందించినా బురదజల్లుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
ఆ పెద్దమనిషివి బురద రాజకీయాలు
హుద్హుద్ సమయంలో రూ.22 వేల కోట్ల నష్టమన్నారు
కానీ రూ.550 కోట్లే ఇచ్చారు
వరద సహాయ చర్యలపై సమీక్షలో సీఎం జగన్
ఈనాడు డిజిటల్, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేసి బాధితులకు వేగంగా పరిహారం అందించినా బురదజల్లుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లితే రూ.34 కోట్లే ఇచ్చారంటూ విమర్శిస్తున్నారని.. ఆ పెద్దమనిషివి బురద రాజకీయాలని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. వరద నష్టంలో 40% రహదారులు, 30% పంటలు, సుమారు 18% ప్రాజెక్టుల రూపేణా జరిగిందని వివరించారు. హుద్హుద్ తుపాను సమయంలో రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పి.. రూ.550 కోట్లు మాత్రమే సాయం అందించారని, అదీ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని విమర్శించారు. వరద బాధితులను శరవేగంగా ఆదుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని, కనీసం నెల సమయం పట్టేదని చెప్పారు. ఇప్పుడు వారం రోజుల్లోనే సాయం అందిస్తున్నామన్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం సోమవారం వర్చువల్గా సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతి, నష్టపరిహారం, నిత్యావసరాల పంపిణీ, రహదారుల తాత్కాలిక పునరుద్ధరణ వంటి అంశాలను తెలుసుకున్నారు.
ఇళ్లు లేనివారికి తాత్కాలిక వసతి
‘వరద బాధిత ప్రాంతాల్లో ఇళ్లు లేని వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలి. నివాసాలు ఏర్పాటయ్యే వరకూ వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. చెరువులకు గండ్లు పడకుండా పర్యవేక్షించాలి. చెరువుల మధ్య అనుసంధానత, అవి నిండగానే అదనపు నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఉండేలా దృష్టిపెట్టాలి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి తలెత్తింది. అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకు గండ్లు పడ్డాయి. ఆ ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా.. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి అదనపు సాయం రూ.2 వేలు అందాలి. పంట నష్టం లెక్కింపు పూర్తయిన వెంటనే సామాజిక తనిఖీ నిర్వహించాలి. క్షేత్రస్థాయి పర్యటనలో వచ్చే విజ్ఞప్తులపై అధికారులు ఉదారంగా స్పందించాలి. పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తవి మంజూరు చేసి, వెంటనే పనులు పూర్తయ్యేలా చూడాలి’ అని సీఎం స్పష్టం చేశారు.
గతంలో పరిహారం ఇవ్వడానికే నెల
‘గతంలో వరదల సమయంలో ఇళ్లు ధ్వంసమైనా, దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణించినా పరిహారం ఇచ్చేందుకు నెల పట్టేది. గల్లంతైన వారికి పరిహారం ఇచ్చేవారు కాదు. రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలనుకునేవాళ్లు. ఇప్పుడు వారం రోజుల్లోనే పరిహారం ఇచ్చి ఆదుకున్నాం. నిత్యావసరాలతోపాటు రూ.2 వేల అదనపు సాయం అందించాం. గతంలో సీజన్ ముగిసేలోగా రైతులకు సాయం చేసిన దాఖలాల్లేవు. ఇన్పుట్ సబ్సిడీ అందాలంటే కనీసం ఏడాది పట్టేది. ప్రస్తుతం పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోగా సాయం చేస్తున్నాం. బాధితులకు అన్ని రకాలుగా నష్టపరిహారం అందించాం’ అని సీఎం చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విష కౌగిలిలో విలవిల
తూర్పు తీరాన పొద్దుపొడుపు... ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి... అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు కనీవినీ ఎరుగనికబ్జాకాండకు తెరతీశారు. -
ధీమా లేదు.. బీమా రాదు!
జగన్ అంటే రివర్స్ కదా... అధికారం అప్పగిస్తే అల్లకల్లోలం చేశారు... సాఫీగా సాగుతున్న పద్ధతిని సంక్లిష్టం చేశారు..! కౌలు కార్డులంటూ కష్టాలు తెచ్చారు... విత్తనాలు లేవు... విత్తమూ ఇవ్వలేదు... బీమా దక్కలేదు.. పంటలకు, జీవితాలకు ధీమా కల్పించలేదు... ప్రాణాలు వదిలేసినా... -
భగ్గుమంటున్న మగ్గం
రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. -
దుల్హన్ బంద్ కియా ... తోఫాకో దోకా దియా!
ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్ తోఫాను రద్దు చేశారు. -
సొమ్ము జనానిది.. బొమ్మ జగన్ది!
కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. -
ఉద్యోగాలు సృష్టించే నాయకుణ్ని ఎన్నుకోవాలి
ఏ నాయకుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తారు? ఎవరి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి? రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరు కాపాడతారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు వెంకటరావు మూల్పూరి సూచించారు. -
యూరప్ వెళ్తా.. అనుమతించండి
విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. -
రూ.7 వేల కోట్ల రుణ సమీకరణకు ప్రయత్నాలు..
ఎప్పుడో బటన్ నొక్కి, నెలల తరబడి పెండింగ్లో ఉంచిన వివిధ పథకాల సొమ్ములను పోలింగ్ ముందురోజు పంచేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నతాధికారులే హైకోర్టును ఆశ్రయించారు. -
పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని ‘నాగ రామ జపాన్ హబ్’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ‘ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్’ పురస్కారం అందుకున్నారు. -
ఒక్క వానకే.. దెబ్బతిన్న ఆసుపత్రి గోడలు
వైకాపా పాలనలో చేపట్టిన పనుల్లో ఎక్కడా చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న సర్వజన వైద్యశాల (సాధారణ) అదనపు గదుల గోడలు ఒక్క గాలి వానకే దెబ్బతిన్నాయి. -
పాలిసెట్లో 87.61% మంది అర్హత
ఏపీ పాలిసెట్లో 87.61శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,42,025మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,24,430మంది అర్హత సాధించారు. పాలిసెట్ ఫలితాలను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం -
ఆ ‘గోవా’ మద్యం తాగితే ప్రాణాలు పోవడం తథ్యం
ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు
జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. -
‘నేనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు బాధితుడినే’
ల్యాండ్ టైటిలింగ్ చట్ట బాధితులు బయటికొస్తున్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడా చూసుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్కు ఇదే పరిస్థితి ఎదురైంది. -
మరో రెండు రోజులు వర్షాలు!
మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. -
సంక్షిప్తవార్తలు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య’ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. -
ఓటు ప్రాధాన్యంపై నేడు రౌండ్టేబుల్ సమావేశం
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం’ అంశంపై విజయవాడలో గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. -
పింఛనుదారులకు పూర్వ వైభవం రావాలి
ఐదేళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబసభ్యులతో సహా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్లో స్థిరపడిన ప్రభుత్వ పింఛనుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎన్బీ బుచ్చిరాజు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. -
వారికి లేని బాధ మీకెందుకు?
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడకుండా సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను నిలువరించాలని, వారి ప్రసంగాలను ప్రచురితం, ప్రసారం చేయకుండా మీడియాను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు