Afghan crisis: అఫ్గాన్లో తాలిబన్ల ప్రతీకారేచ్ఛ
అఫ్గానిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రతీకారం జోలికి వెళ్లబోమని ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన తాలిబన్లు..
గత ప్రభుత్వానికి సహకరించిన వారికోసం అన్వేషణ
ఓ జర్నలిస్టు బంధువు ప్రాణాలు బలితీసుకున్న ముఠా
భారత కాన్సులేట్ ఆఫీసుల్లో సోదాలు
గత నెల్లో 9 మంది హజారాల హత్య : ఆమ్నెస్టీ
కాబుల్: అఫ్గానిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రతీకారం జోలికి వెళ్లబోమని ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన తాలిబన్లు.. ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. తమపై పోరాటంలో అమెరికా నేతృత్వంలోని బలగాలకు, అఫ్గాన్ ప్రభుత్వానికి సహకరించిన కీలక వ్యక్తుల గురించి వారు అన్వేషణ ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ సోదాలు నిర్వహిస్తున్నారు. జర్మనీకి చెందిన వార్తాసంస్థలో పనిచేస్తున్న ఓ జర్నలిస్టు కోసం వెతుకుతూ.. ఆయన సమీప బంధువును తాలిబన్లు పొట్టనపెట్టుకోవడం కలకలం సృష్టిస్తోంది. హజారా మైనారిటీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని గత నెల్లో వారు క్రూరంగా చంపేసిన సంగతి కూడా తాజాగా బయటపడింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించి వారం రోజులు కూడా కాకముందే.. విధులకు హాజరు కాకుండా వారిని తాలిబన్లు అడ్డుకుంటుండటమూ పలు అనుమానాలకు తావిస్తోంది.
* హజారాలపై మళ్లీ ఉక్కుపాదం
మానవ హక్కుల కోసం పోరాడే ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ సంస్థ.. తాలిబన్ల క్రూరత్వానికి సంబంధించి తాజాగా కీలక విషయాలను బయటపెట్టింది. ఈ సంస్థ కథనం ప్రకారం.. అఫ్గాన్లో గజనీ ప్రావిన్సులోని ముందరఖ్త్ గ్రామంలో తాలిబన్లు గత నెల 4-6 తేదీల మధ్య విధ్వంసం సృష్టించారు. హజారా వర్గం ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. తొమ్మిది మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. వారిలో ఆరుగుర్ని కాల్చిచంపగా, మిగతా ముగ్గుర్ని చిత్రవధ చేసి చంపేశారు. వాస్తవానికి హత్యల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా. ఒకప్పటి తాలిబన్ల అరాచక పాలనను ఈ హత్యలు గుర్తుచేస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కాలమర్డ్ పేర్కొన్నారు. హజారాలు షియా ముస్లింలు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారిపై తాలిబన్లు ఉక్కుపాదం మోపారు.
* జర్నలిస్టు బంధువులపై దాడి
మీడియా స్వేచ్ఛను హరించబోమని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు ఆ మాట కూడా తప్పారు. జర్మనీకి చెందిన ‘డాట్షె విల్లె’ వార్తాసంస్థలో సంపాదకుడిగా ఉన్న ఓ వ్యక్తి కోసం అఫ్గాన్లో వారు కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సదరు జర్నలిస్టు బంధువులపై దాడి చేశారు. వారిలో ఒకరు మృత్యువాతపడగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాలిబన్లు వెతుకుతున్న జర్నలిస్టు ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్లు సమాచారం. తాజా హత్యను డాట్షె విల్లె డైరెక్టర్ జనరల్ పీటర్ లింబర్గ్ ఖండించారు. తమ సంస్థకు చెందిన మరో ముగ్గురు జర్నలిస్టుల కోసం కూడా తాలిబన్లు వెతుకుతున్నట్లు సమాచారముందని చెప్పారు. మరోవైపు- గత అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులతో పాటు అమెరికా నేతృత్వంలోని విదేశీ బలగాలకు సహకారం అందించినవారి పేర్లతో తాలిబన్లు బ్లాక్లిస్ట్ను తయారుచేసుకున్నారని నార్వేకు చెందిన ‘రిప్టో నార్వేజియన్ సెంటర్ ఫర్ గ్లోబల్ అనలైసెస్’ ఓ నివేదికలో వెల్లడించింది. వారికోసం అన్వేషిస్తున్నారని తెలిపింది. జాబితాలోని పలువురికి.. తాలిబన్ మిలటరీ కమిషన్ పేరిట ఇప్పటికే బెదిరింపు లేఖలు కూడా పంపారని పేర్కొంది.
* మహిళల విధులకు అడ్డగింత
మహిళల హక్కులను పరిరక్షిస్తామన్న మాటనూ తాలిబన్లు నిలబెట్టుకోవడం లేదు. తాను కార్యాలయంలోకి వెళ్లకుండా తాలిబన్లు నిలువరించారని రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ యాంకర్ షబ్నమ్ఖాన్ దవ్రాన్ తాజాగా వెల్లడించారు. తనకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని మరో మహిళా జర్నలిస్టు ఖదీజా తెలిపారు.
* విమానాశ్రయానికి వేలమంది..
కాబుల్ విమానాశ్రయానికి శుక్రవారం కూడా వేలమంది పోటెత్తారు. వాస్తవానికి నగరవ్యాప్తంగా తాలిబన్లు చెక్పాయింట్లు పెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అఫ్గానీలు విమానాశ్రయానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దొరికినవారిని చితకబాదిమరీ వెనక్కి పంపుతున్నారు. ఎలాగోలా ముష్కరుల కళ్లుగప్పి, అతికష్టమ్మీద జనం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.
* ఐక్యతకు పిలుపునిచ్చిన ఇమామ్లు
కాబుల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నాక వచ్చిన తొలి శుక్రవారం కావడంతో.. ఏవైనా ఉద్రిక్తతలు తలెత్తుతాయేమోనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అలాంటివేమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని మసీదులకు గత 2-3 శుక్రవారాలతో పోలిస్తే ఎక్కువ జనం రావడం గమనార్హం. మరోవైపు- దేశం విడిచి వెళ్లకుండా ప్రజల్లో ధైర్యం నింపాలని, ఐక్యత కోసం పిలుపునివ్వాలని ఇమామ్లకు తాలిబన్లు మార్గదర్శకాలు జారీ చేశారు. తదనుగుణంగా పలువురు ఇమామ్లు ప్రసంగాలు చేశారు.
* 31 తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు!
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ఈ నెల 31తో ముగియనుంది. అప్పటివరకు కీలక చర్యలేవీ చేపట్టకుండా అమెరికాకు, తాలిబన్లకు మధ్య ఒప్పందం ఉందని అఫ్గాన్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు, కీలక నిర్ణయాల ప్రకటన వంటి చర్యలకు ముష్కర ముఠా ఈ నెలాఖరు వరకు దూరంగా ఉండే అవకాశముందని చెప్పారు.
* పాక్ రక్షణలో తాలిబన్ అధినేత?
తాలిబన్లు అఫ్గాన్ను ఆక్రమించినా.. వారి అధినేత హైబతుల్లా అఖుంద్జాదా ఇప్పటికీ బహిరంగంగా కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఎక్కడున్నారన్నదీ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ నిఘా సంస్థలు అందించిన సమాచారాన్ని విశ్లేషించిన భారత వర్గాలు.. అఖుంద్జాదా ప్రస్తుతం పాకిస్థాన్ సైన్యం రక్షణలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. అమెరికా డ్రోన్ దాడుల్లో అఖ్తర్ మన్సూర్ హతయ్యాక.. ఆయన స్థానంలో తాలిబన్ల సుప్రీం లీడర్గా 2016 మేలో అఖుంద్జాదా నియమితులయ్యారు. ఆరు నెలలుగా తాలిబన్ నేతలకు కూడా ఆయన కనిపించలేదు.
భారత కాన్సులేట్లలో తనిఖీలు
ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలను కోరుకుంటున్నామని పైకి చెప్తున్న తాలిబన్లు.. వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కాందహార్, హెరాత్లలోని భారత కాన్సులేట్ల్లోకి వారు చొరబడ్డారు. తనిఖీలు నిర్వహించారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. కాందహార్, హెరాత్లలో ఇప్పటికే మూసివేసిన భారత కాన్సులేట్ కార్యాలయాల్లోకి తాలిబన్లు బుధవారం ప్రవేశించారు. పలు కీలక పత్రాల కోసం వెతికారు. అనంతరం కార్యాలయాల ముందు నిలిపి ఉంచిన కార్లను తీసుకెళ్లారు. కాబుల్లోని భారత రాయబార కార్యాలయంలో మాత్రం తనిఖీలేవీ జరగలేదని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు. కాబుల్లో రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయొద్దని, అక్కడి సిబ్బంది భద్రతకు తాము భరోసా ఇస్తామని కతర్లోని తాలిబన్ కార్యాలయం నుంచి భారత్కు సందేశం వచ్చినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM