కదిలిన ‘జన’శ్రేణులు.. కడలిలా కర్షకులు
‘రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ మాటలను గుర్తుచేస్తూ.. ఆ పార్టీ నాయకులు రైతుల్లో ఉత్సాహం నింపారు. పాదయాత్రలో రైతులకు
అమరావతి రైతుల యాత్రకు నెల్లూరు నీరాజనం
పాదయాత్రలో కదంతొక్కిన జనసేన కార్యకర్తలు
ఈనాడు డిజిటల్, నెల్లూరు: ‘రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ మాటలను గుర్తుచేస్తూ.. ఆ పార్టీ నాయకులు రైతుల్లో ఉత్సాహం నింపారు. పాదయాత్రలో రైతులకు తోడుగా జనసేన శ్రేణులు కదం తొక్కారు. రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర 26వ రోజు రాజుపాళెం నుంచి నెల్లూరు వరకు 15 కి.మీ. సాగింది. 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేడ్కర్, జగ్జీవన్రామ్కు నివాళులర్పించి శుక్రవారం యాత్రను ప్రారంభించారు. రాజుపాళేనికి చెందిన ఎస్సీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవాలి’ అంటూ కలిసి నడిచారు. యాత్రకు నెల్లూరు, కోవూరు ప్రాంత వాసులు నీరాజనం పట్టారు. కోవూరు, నెల్లూరు నగరంలో వ్యాపారులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో చేరుకుని సంఘీభావం తెలిపారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ యాత్రలో పాల్గొన్నారు. నెల్లూరులో వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కోవూరు, నెల్లూరులోని ప్రతి కూడలిలో యాత్ర బృందానికి హారతులిచ్చి స్వాగతం పలికారు. సికింద్రాబాద్కు చెందిన బీసీ సంఘం నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఇంకా వర్క్ ఫ్రం హోంలోనే సీఎం
కొవిడ్ తగ్గినా సీఎం జగన్మోహన్రెడ్డి వర్క్ ఫ్రం హోం వీడట్లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. నాదెండ్ల నేతృత్వంలో జనసేన నాయకులు, కార్యకర్తలు కోవూరు వద్ద మహాయాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ... ఇంటి పక్కనున్న రాజధాని రైతులకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా ఉండాలన్నదే జనసేన సంకల్పమని స్పష్టం చేశారు. పవన్కల్యాణ్ రైతులకు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తప్పుడు బిల్లులు పెట్టి అసెంబ్లీ సమయాన్ని వృథా చేస్తున్నారని హితవుపలికారు. జగన్మోహన్రెడ్డి రివర్స్ పాలనలో.. బిల్లులూ రివర్స్ చేయడం సరికాదని హితవు పలికారు.
నేతన్నల మద్దతు: నెల్లూరు చేనేత సమాఖ్య నేతలు యాత్రలో పాల్గొన్నారు. జిల్లా నేతన్నలు యాత్ర చేస్తున్న మహిళలకు చీరలు పెట్టి మద్దతు తెలిపారు. ఆ చీరలను కోవూరు ప్రాంతంలో వరద బాధిత మహిళలకు అందించారు. మాజీ ఎంపీ పనబాక లక్ష్మి యాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ప్రశ్నించడమే నేరమా?.. 8 నెలల గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM