ఎడాపెడా రుణానికి ఏర్పాట్లు
ఒకవైపు పరిమితికి మించి అప్పులు చేస్తున్నారంటూ కేంద్రం కన్నెర్ర చేస్తోంది. ఇంతకుమించి రుణాలు తీసుకునేందుకు వీలు లేదంటూ చట్రంలో బిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో సుమారు మరో రూ.లక్ష కోట్ల రుణాలు తీసుకునేందుకు ఏకంగా
సుమారు రూ. లక్ష కోట్ల అప్పునకు దారులు
ఈనాడు, అమరావతి: ఒకవైపు పరిమితికి మించి అప్పులు చేస్తున్నారంటూ కేంద్రం కన్నెర్ర చేస్తోంది. ఇంతకుమించి రుణాలు తీసుకునేందుకు వీలు లేదంటూ చట్రంలో బిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో సుమారు మరో రూ.లక్ష కోట్ల రుణాలు తీసుకునేందుకు ఏకంగా ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించడంతో విశ్రాంత ఆర్థికశాఖ అధికారులు, ఆర్థిక వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారు విస్తుపోతున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2021-22 ఏడాదిలో 4% మించి అంటే రూ.42,472 కోట్లకు మించి అప్పు చేయడానికి వీల్లేదని కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అసలు రాష్ట్రం ఎక్కడ ఎంతెంత అప్పులు చేసిందో ఆ వివరాలు పంపాలంటూ లెక్కలు తీసుకుని నికర రుణ పరిమితిలో రూ.17,923 కోట్ల కోత పెట్టింది. అంతటితో ఆగకుండా.. కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ఎంతమేర గ్యారంటీలు ఇచ్చిందీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర గ్యారంటీలు ఇవ్వబోతోందో కూడా కేంద్రం వివరాలు సేకరించింది. అంటే కార్పొరేషన్ల రుణాల విషయంలోనూ పరిమితి దాటకూడదనే దృష్టి కోణాన్ని ప్రదర్శించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చేందుకు ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఏకంగా రెట్టింపు చేసేసింది. ఎడాపెడా మరింత అప్పులు చేసేందుకు మార్గాన్ని మరింత సుగమం చేసుకుంది. ఈ వ్యవహారం రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఉన్న అనేక మౌలికాంశాలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
అప్పు ఎంతో నిర్దేశించేది కేంద్రమే
రాష్ట్రప్రభుత్వం ఎంత అప్పు తీసుకోవచ్చో నిర్ణయించేది కేంద్రమే. రిజర్వుబ్యాంకు నిర్వహించే వేలంలో రాష్ట్రం పాల్గొని బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు స్వీకరిస్తుంది. ఈ పరిమితిని కేంద్రం రాష్ట్ర స్థూల ఉత్పత్తిని బట్టి లెక్కిస్తోంది. అన్ని అప్పులనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాత, పాత అప్పులు ఎంతమేర తీర్చిందో సరిచూశాకే కేంద్రం ఈ మొత్తాన్ని నిర్ణయిస్తోంది. కేంద్రం ఇంత కసరత్తు చేస్తూ నియంత్రిస్తుంటే ఆ పరిమితిని దాటేలా రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలు కేంద్ర కసరత్తును ఫార్సుగా మార్చేస్తున్నాయని నిపుణుల వాదన.
కార్పొరేషన్ల అప్పులు దేని కోసం?
ఆంధ్రప్రదేశ్లో అనేక కార్పొరేషన్లు రుణాలు తీసుకుంటున్నా వాటికి ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఆ నిధులు ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు, సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో తాజాగా రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.25,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఆ కార్పొరేషన్కు ఆదాయం ఏమీ లేనందున ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ సుంకం విధించి ఆ మొత్తాన్ని సంచిత నిధికి జమచేసి అక్కడి నుంచి కార్పొరేషన్ చెల్లించే రుణాల కోసం మళ్లిస్తోంది. ఇలా నెలకు రూ.250 కోట్ల చొప్పున 137 వాయిదాల్లో 2035 వరకు ప్రభుత్వం చెల్లిస్తూనే ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 266(1) ప్రకారం భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టడంలో ప్రైమఫసీ ఉందంటూ కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసి వివరణ కోరింది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చట్టం ఆర్టికల్ 293 (3)కి విరుద్ధంగా ఉందంటూ వివరణ కోరింది. తాజాగా అదే చేయూత, ఆసరా, అమ్మఒడికి బెవరేజస్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుని వినియోగించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ రుణం తీర్చేందుకు మళ్లీ ప్రభుత్వమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వాటికి నిధులు ఇవ్వాల్సి వస్తోంది. అంతకుముందు బెవరేజస్ కార్పొరేషన్ చేసే మద్యం వ్యాపారంపై ఆదాయపు పన్ను చెల్లించాలంటూ ఆ శాఖ తాఖీదు పంపి, న్యాయస్థానానికి వెళ్లింది. దీంతో ప్రభుత్వం ఐఎంఎఫ్ఎల్ 1993 చట్టానికి 2012లో సవరణ చేసింది. చట్టం 5/2012 ప్రకారం.. 4ఎ, 4బి, 4సి సెక్షన్లు జతచేశారు. దాని ప్రకారం బెవరేజస్ కార్పొరేషన్ పన్ను, సెస్, మార్జిన్, అదనపు మార్జిన్ ఏది విధించినా అదంతా రాష్ట్రప్రభుత్వ ఆదాయమే తప్ప కంపెనీ ఆదాయం కాదని చట్టం చేశారు. ఈ పరిస్థితుల్లో బెవరేజస్ కార్పొరేషన్ రుణానికి చేసే చెల్లింపులు ప్రభుత్వ ఆదాయం కిందకు రావా అన్న ప్రశ్న తలెత్తుతో]ది.
కేంద్రానికి వేడి..
రాష్ట్రప్రభుత్వం తీసుకునే అనేక అప్పులకు కేంద్రానిదే బాధ్యత. అనేక విదేశీ ఆర్థికసంస్థలు ఇప్పటికే ఏపీ అప్పులు తీర్చట్లేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖను సంప్రదిస్తున్నాయి. ఈ రుణాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడితే ఆ బాధ్యత కేంద్రంపై ఉంటుందని నిపుణుల వాదన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..