35 మందితో..
భారత్ను బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పాలించింది 89 సంవత్సరాలే (1858-1947)! ఈస్టిండియా కంపెనీ మాత్రం దాదాపు 150 ఏళ్లు అధికారం చెలాయించింది. భౌగోళికంగా, జనాభా, సంపద పరంగా ఎన్నో రెట్లు పెద్దదైన....
భారత్ను బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పాలించింది 89 సంవత్సరాలే (1858-1947)! ఈస్టిండియా కంపెనీ మాత్రం దాదాపు 150 ఏళ్లు అధికారం చెలాయించింది. భౌగోళికంగా, జనాభా, సంపద పరంగా ఎన్నో రెట్లు పెద్దదైన అఖండ భారతావనిని పాలించిన ఈ ఈస్టిండియా కంపెనీ వద్ద ఉన్న బలం, బలగం ఎంత అని చూస్తే....
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని తూర్పు ఆసియాలో ఇంగ్లాండ్ తరఫున వ్యాపారం చేసేందుకు 1600 సంవత్సరం డిసెంబరులో స్థాపించారు. కొంతమంది ఇంగ్లాండ్ వ్యాపారవేత్తలు (వీరిలో ఓ మద్యం వ్యాపారి, వస్త్రవ్యాపారి, తోలువ్యాపారితో పాటు కొంతమంది సముద్ర దొంగలు కూడా ఉన్నట్లు చెబుతారు) ఉమ్మడిగా... 60 వేల పౌండ్ల పెట్టుబడితో జాయింట్ స్టాక్ కంపెనీగా మొదలైంది. బ్రిటన్ రాణి అనుమతితో భారత ఉపఖండంలో వ్యాపారాన్ని మొదలెట్టారు.
అప్పటికే స్పెయిన్, పోర్చుగల్కు చెందిన కంపెనీలు ఈ ప్రాంతంలో వ్యాపారంలో స్థిరపడ్డాయి. వారిని చూసే ఇంగ్లాండ్ ఈస్టిండియా కంపెనీ రంగంలోకి దిగింది. ఆరంభించిన తొలినాళ్లలో ఈస్టిండియా కంపెనీకి ప్రత్యేకంగా కార్యాలయం అంటూ ఏమీ లేదు. మొదటి 20 సంవత్సరాల పాటు... లండన్లోని తమ డైరెక్టర్ థామస్ స్మిత్ ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించింది. సిబ్బంది ఆరుగురే! భారత్పై పట్టు బిగించేనాటికి లండన్లో చిన్న కార్యాలయంలో 35 మంది సిబ్బంది ఉండేవారు. భారత్లో పాలనాధికారం చేపట్టిన 30 సంవత్సరాలకుగానీ (1790 నాటికి)... వారి లండన్ కార్యాలయ సిబ్బంది సంఖ్య 150 దాటలేదు.
కేవలం 3వేల మందితో...
వ్యాపార రక్షణ కోసం తొలుత కొంతమంది సాయుధులను ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్న ఈస్టిండియా దీన్ని ప్రణాళికాబద్ధంగా పెంచుకుంది. డచ్, ఫ్రెంచ్ తదితర కంపెనీలతో పోరాటాలకుగాను స్థానికులనే సైనికులుగా నియమించుకున్నారు. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్క్లైవ్ సైన్యం 3 వేల మందే. వారితోనే 50వేల మంది సైన్యమున్న మొఘల్ నవాబును ఎదుర్కొని విజయం సాధించాడు క్లైవ్. 1778 నాటికి 70 వేలకు చేరిన ఈస్టిండియా సైన్యంలో చాలామంది భారతీయులే. వారికి యూరోపియన్లతో శిక్షణ ఇప్పించేవారు. ఇలా పెంచుకున్న సైన్యాన్ని మెల్లగా అధికార విస్తరణకూ ఉపయోగించుకుంది. భారత్లోని వివిధ రాజ్యాల మధ్య అనైక్యతను ఆలంబనగా చేసుకొని వారి మధ్య చిచ్చు పెట్టి తాను అధికారం చలాయించటం ఆరంభించింది. బ్రిటన్లోని పారిశ్రామికీకరణ పుణ్యమా అని వచ్చి పడిన ఆధునిక ఆయుధాలు తోడవటంతో స్థానిక రాజ్యాల సైన్యం సంఖ్యలో పెద్దదైనా నిలవలేని పరిస్థితి. పందొమ్మిదో శతాబ్దం ఆరంభానికి ఈస్టిండియా సైనికుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. ఆ సమయానికి బ్రిటన్ సైన్యం కంటే ఇదే పెద్దదంటారు.
భారత్లో దోచుకున్న సొమ్మును స్టాక్ డివిడెండ్ల రూపంలో బ్రిటన్లోని పార్లమెంటు సభ్యులకు పంచేవారు. బ్రిటన్ పార్లమెంటును కూడా పరోక్షంగా గుప్పిట పెట్టుకునే పరిస్థితి. అలా ఓ వ్యాపార సంస్థ ప్రపంచ చరిత్రగతిని మార్చింది. 1833లో పార్లమెంటు ఆమోదం ద్వారా కంపెనీని జాతీయం చేశారు. కానీ సిపాయిల తిరుగుబాటుతో 1858లో ఈస్టిండియా కంపెనీ పాలన ముగిసి... బ్రిటిష్ ప్రభుత్వ పాలన మొదలైంది. 1874లో ఈ కంపెనీని పూర్తిగా రద్దు చేశారు.
శిక్షణకు ప్రత్యేక కళాశాల...
ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగమంటే బ్రిటన్లో జనాలు ఎగబడేవారు. బోర్డు డైరెక్టర్ల సిఫార్సు ఉంటేనేగానీ గుమాస్తా ఉద్యోగం కూడా దొరకని పరిస్థితి. పైగా తొలి ఐదేళ్లు బాండ్కు కట్టుబడి పనిచేయాల్సి వచ్చేది. భారత్లో పనిచేసే తన సిబ్బందికి శిక్షణ కోసం లండన్లో ప్రత్యేకంగా ఈస్టిండియా కళాశాలను కూడా ఆరంభించింది. గుమాస్తాల నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకు ఇందులోనే శిక్షణ ఇచ్చేవారు.
దివాలా తీయబోయి..
భారత్ను దోచుకోవటం ఆరంభించిన ఈస్టిండియా కంపెనీ ఖజానా కళకళలాడిందనే అంతా అనుకుంటాం. అది నిజమే అయినా... ఒకదశలో కంపెనీ దివాలా తీసే పరిస్థితి కూడా తలెత్తింది. రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తిని ఓడించి భారీ సంపదను లండన్కు తరలించిన తర్వాత కంపెనీ పాలన దెబ్బతింది. అప్పటిదాకా ఎన్నడూ చూడనంత సొమ్ము అప్పనంగా వచ్చి పడుతుండటంతో కంపెనీ అధికారగణం పై నుంచి కింది దాకా అవినీతిలో మునిగి తేలింది. ఫలితంగా... కంపెనీకి ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు అదే సమయంలో బెంగాల్లో తలెత్తిన తీవ్ర కరవు కారణంగా పన్నులు తగ్గిపోయాయి. కంపెనీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. 1772లో లండన్లో ఈస్టిండియా డైరెక్టర్ల బోర్డు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 10 లక్షల పౌండ్ల అత్యవసర రుణానికి దరఖాస్తు చేసుకుంది. సాయం చేయకుంటే దివాళా తీయటం తప్ప తమకు మరోమార్గం లేదని చేతులెత్తేసింది. విచారణ జరిపి... భారత్లో కంపెనీ పాలన పద్ధతుల్ని తీవ్రంగా తప్పు పడుతూనే... సాయం చేసి ఈస్టిండియాను గట్టెక్కించింది బ్రిటిష్ ప్రభుత్వం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..